పహల్గాం దాడి ఎఫెక్ట్ ... పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

Published : Apr 28, 2025, 10:31 AM ISTUpdated : Apr 28, 2025, 10:33 AM IST
పహల్గాం దాడి  ఎఫెక్ట్ ...  పాక్ యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం

సారాంశం

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్లపై భారత్ నిషేధం విధించింది. ఇలా 16 యూట్యూబ్ ఛానళ్లపై వేటు పడింది. 

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై తప్పుడు వార్తలు ప్రసారంచేస్తున్న పాకిస్తాన్ యుట్యూబ్ ఛానళ్లను భారత్ నిషేధించింది. ఇకపై భారతదేశంలో 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారంకాకుండా నిషేధం విధించారు. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి.

 

“కశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆర్మీ గురించి తప్పుడు ప్రచారం చేయడం, భద్రతా సంస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మతపరమైన సున్నిత అంశాలగురించి ప్రస్తావించడం... ఇలా తప్పుడు కథనాలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నందుకు డాన్ న్యూస్, సమా టీవీ, ఆర్య న్యూస్, జియో న్యూస్ సహా 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానెళ్లను భారత ప్రభుత్వం నిషేధించింది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

భారత్ నిషేధించిన పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లివే..:

PREV
Read more Articles on
click me!

Recommended Stories

లోన్ ఇచ్చి EMI అడగని బ్యాంక్
ఇండియాలో పెట్టుబడులకు సింగపూర్ కంపెనీ ఆసక్తి