Independent Day celebrations: జ‌మ్మూకాశ్మీర్ లో ఉత్సాహభరితంగా 'హర్ ఘర్ తిరంగ' ర్యాలీ

Published : Aug 13, 2023, 01:44 PM ISTUpdated : Aug 13, 2023, 01:45 PM IST
Independent Day celebrations: జ‌మ్మూకాశ్మీర్ లో ఉత్సాహభరితంగా 'హర్ ఘర్ తిరంగ' ర్యాలీ

సారాంశం

Srinagar: భారత స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో 'హర్ ఘర్ తిరంగా' ప్రచార స్ఫూర్తితో ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల్లోని డీపీల‌ను త్రివర్ణ పతాకంగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఇండిపెండెన్స్'తో దేశం సంబరాలు చేసుకుంటోంది. ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే 'హర్ ఘర్ తిరంగా' ఉద్యమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పీఎం పిలుపునిచ్చారు.  

Har Ghar Tiranga Rally: 76వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని జ‌మ్మూకాశ్మీర్ లోని  శ్రీనగర్ కు చెందిన పాఠశాల విద్యార్థుల బృందం ఆదివారం 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంది. 'మేరీ మాతీ మేరా దేశ్' ప్రచారంలో భాగంగా జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ విద్యార్థులు ప్లకార్డులు, జెండాలతో సగర్వంగా కవాతు చేస్తున్న దృశ్యాలు సోష‌ల్ మీడియా వైర‌ల్ గా మారాయి.

జ‌మ్మూకాశ్మీర్ పోలీసులు నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 'మేరీ మాతీ మేరా దేశ్' కార్యక్రమం అంతర్భాగం కావడం గమనార్హం. ఈస్ట్ శ్రీనగర్ డీఎస్పీ శివం సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ ప్రచారం మన దేశంలో తరచుగా విస్మరించబడే హీరోల గురించి అవగాహన పెంచడానికి దోహ‌ద‌ప‌డుతుంది. అంత‌కుముందు, శనివారం మధ్య కాశ్మీర్ లోని గందర్ బల్ జిల్లాలోని 26 పంచాయతీల్లో వివిధ రకాల కార్యక్రమాలను నిర్వ‌హించారు. గండేర్బల్లోని డిస్ట్రిక్ట్ యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ఆఫీస్ (డీఐఎస్ఎస్ఓ) పలు ఆకర్షణీయమైన కార్యక్రమాలను ప్రదర్శించింది. 'మేరీ మాతీ, మేరా దేశ్' థీమ్ తో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. జోన్ కంగన్ లో 'ప్రభాత్ ఫెరీ' లేదా ఉదయం ఊరేగింపుతో ఈ రోజు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

'హర్ ఘర్ తిరంగా' ప్రచారం..

'హర్ ఘర్ తిరంగా' ప్రచారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కొన‌సాగుతోంది. ఇది భారతదేశ 76 వ స్వాతంత్య్ర‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకమైన తిరంగాను వారి ఇళ్లలోకి తీసుకురావడానికి, దానిని ఎగురవేయడానికి దేశ ప్రజలను ప్రేరేపించడానికి లక్ష్యంగా పనిచేస్తుంది."76 వ స్వాతంత్య్ర‌ సంవత్సరంలో ఒక దేశంగా జెండాను సామూహికంగా ఇంటికి తీసుకురావడం తిరంగాతో వ్యక్తిగత సంబంధానికి చిహ్నంగా మాత్రమే కాకుండా, జాతి నిర్మాణం పట్ల మా నిబద్ధతకు ప్రతిరూపంగా మారుతుంది" అని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ప్రజల హృదయాల్లో దేశభక్తి భావనను పెంపొందించడం, భారత జాతీయ పతాకంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశమని పేర్కొంది. 

ఫుల్ డ్రెస్ రిహార్సల్..

ఆగస్టు 15న జరగాల్సిన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు రిహార్స‌ల్స్  జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో రాబోయే స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల కోసం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ ఏర్పాటు చేశారు. ఫలితంగా ఢిల్లీలోని పలు రహదారుల్లో ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేశారు. అంతేకాకుండా, ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచిస్తూ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక నోటీసు జారీ చేశారు. ఉదయం 11 గంటల వరకు ఢిల్లీలోని పలు మార్గాలను మూసివేశారు.
 

PREV
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu