
రాజస్థాన్లో వరుస ప్రమాదాలతో రహదారులు రక్తమోడాయి. దిద్వానా-కూచమన్ జిల్లాలో ఓ ప్రమాదం జరిగింది. రెండో ప్రమాదం టోంక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకెళ్తే.. దివానా-కూచమన్లో జరిగిన ప్రమాదంలో వ్యాన్, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. దీంతో పాటు ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
ఖుంఖునా పోలీస్ స్టేషన్లోని బంథాడి గ్రామ సమీపంలో ఒక వ్యాన్, బస్సు ఢీకొన్నాయని దివానా-కుచమన్ DSP ధర్మ్చంద్ బిష్ణోయ్ తెలిపారు. ప్రమాదానికి గురైన బాధితులు వ్యాన్లో వివాహ వేడుకకు వెళుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. గాయపడిన వారిని బంగర్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు.
అదే సమయంలో టోంక్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అతి వేగంగా వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 28 మంది ప్రయాణికులు గాయపడ్డారు. టోంక్ జిల్లాలోని దేవ్లీ NH-52పై వేగం వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రమాదం బారినపడింది. బస్సుపై డ్రైవర్ పట్టుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. క్షత్రగాత్రులను సీహెచ్సీకి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని టోంక్కు తరలించారు.
దూని పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్ఘర్ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కోటా నుంచి బస్సు సర్దార్కు వెళ్తోందని సీఓ డియోలి సురేష్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత విజయ్ఘర్ మోడ్ సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు తిరగగానే ఒక్కసారిగా కేకలు వినిపించాయి.
కొంతమంది ప్రయాణికులు స్వయంగా బయటకు రాగా, మరికొందరు ప్రయాణికులను బాటసారులు బయటకు లాగారు. దీంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని సీఓ దేవ్లి సురేష్ కుమార్ తెలిపారు.