ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. ఆర్టీఐ కార్య‌క‌ర్త అరెస్టు

Published : May 28, 2023, 10:39 AM IST
ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. ఆర్టీఐ కార్య‌క‌ర్త అరెస్టు

సారాంశం

Mumbai: ప్రధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి  అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక ఆర్టీఐ కార్యకర్తను అరెస్టు చేశారు. మొండిగా తమను బెదిరించారని పోలీసులు తెలిపారు. చ‌ట్టం ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. 

RTI activist arrested: ప్రధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి  అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక ఆర్టీఐ కార్యకర్తను అరెస్టు చేశారు. మొండిగా తమను బెదిరించారని పోలీసులు తెలిపారు. చ‌ట్టం ప్ర‌కారం త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు.  

వివ‌రాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేత కిరీట్ సోమయ్యలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్టీఐ కార్యకర్తను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సోషల్ మీడియా వేదిక‌గా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నేత కిరీట్ సోమయ్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆర్టీఐ కార్యకర్త గులాం ఖాజీని అరెస్టు చేసినట్లు ముంబ‌యి పోలీసులు తెలిపారు. 

ఆర్టీఐ కార్యకర్తలపై సకినాక పోలీస్ స్టేషన్ లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు తమను బెదిరించారని పోలీసులు తెలిపారు. అంత‌కుముందు కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డుతామ‌ని ఇటీవ‌ల ఒక వ్య‌క్తి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. కొచ్చి పర్యటనలో ప్రధాని మోడీపై ఆత్మాహుతి దాడి చేస్తామని లేఖ రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న వ్యక్తిని సావర్ గా గుర్తించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఎం హోదాలో విజయ్ తొలి స్వాతంత్య్ర వేడుకలు | CM Vijay First Independence Day Celebrations
Independence Day 2026 : ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు... ఎర్రకోట సాక్షిగా యువతపై వరాలు కురిపించిన ప్రధాని