భర్తలకు విడాకులు: పెళ్లి చేసుకొన్న ఇద్దరు యువతులు

Published : Jan 01, 2019, 04:55 PM IST
భర్తలకు విడాకులు: పెళ్లి చేసుకొన్న ఇద్దరు యువతులు

సారాంశం

ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు


 లక్నో: ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు. అయితే వీరిద్దరి వివాహన్ని చట్టబద్దం చేసేందుకు రిజిష్ట్రార్  మాత్రం అంగీకరించలేదు.  ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్‌ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్‌ఖండ్ రాష్ట్రంలోని హమీర్‌పూర్‌కు చెందిన  24, 29 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువతులు ఆరేళ్ల క్రితం తమ కాలేజీలో మొదటిసారి పరిచయమయ్యారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబసభ్యులు యువతులను కాలేజీ మాన్పించి పెళ్లి చేశారు.

చదువు మధ్యలోనే మాన్పించి పెళ్లి చేయడంతో  ఒకరిని విడిచి మరోకరం ఉండలేకపోతున్నామని ఆ యువతులు చెబుతున్నారు. అయితే  తమ ప్రేమను కొనసాగించేందుకు వీలుగా  ఇద్దరూ కూడ తమ భర్తలకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

ఈ మేరకు ఇద్దరూ కూడ తమ భర్తలకు విడాకులు ఇచ్చారు. గత ఏడాడి డిసెంబర్ 29వ తేదీన  ఈ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకొన్నారు. అంతేకాదు ఈ వివాహన్ని చట్టబద్దం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ, ఈ వివాహన్ని రిజిస్టర్ చేయడానికి రిజిష్ట్రార్ మాత్రం అంగీకరించలేదు.

ఈ వివాహన్ని  చట్టబద్దం చేయాలని  యువతుల తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు.స్వలింగ సంపర్కం నేరం కాదని  సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!