Sex Ratio in The Country: లింగ నిష్పత్తి రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు.. లడ‌ఖ్‌లో ఎక్కువ.. మణిపూర్‌లో తక్కువ

Published : May 06, 2022, 04:26 AM IST
Sex Ratio in The Country: లింగ నిష్పత్తి రిపోర్ట్‌లో సంచ‌ల‌న విష‌యాలు.. లడ‌ఖ్‌లో ఎక్కువ.. మణిపూర్‌లో తక్కువ

సారాంశం

Sex Ratio in The Country: దేశంలో లింగ నిష్పత్తి మధ్య అంతరం క్రమంగా త‌గ్గుతోంది. 2020 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ 2020లో దేశంలో అత్యధిక లింగ నిష్పత్తిని నమోదు చేసింది, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ మరియు నికోబార్ దీవులు, త్రిపుర మరియు కేరళ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 880 కంటే తక్కువ నమోదు కాలేదు.   

Sex Ratio in The Country: దేశంలో రోజురోజుకూ లింగ నిష్పత్తిలో తేడా క‌నిపిస్తుంది. ప‌లు చోట్ల ప‌రిస్థితి మెరుగుప‌డింది.  తాజాగా 2020 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ విడుదలైన నివేదిక ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో అత్యధిక లింగ నిష్పత్తి  నమోదయింది. ల‌డ‌ఖ్ జననాల్లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 1104 మంది మహిళలు ఉన్న‌ట్టు నివేదిక  తెలిపింది. 

ఈ రిపోర్టు ప్రకారం.. ల‌ఢ‌ఖ్ తర్వాత స్థానాల్లో అండమాన్ నికోబార్ దీవులు, త్రిపుర, కేరళ లు వ‌రుసగా  నిలిచాయి. అరుణాచల్‌ప్రదేశ్‌ లో వెయ్యి మంది పురుషులకు  1011 మంది  మహిళలు.. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 984 , త్రిపురలో  974 , కేరళ  969  మంది మహిళలు ఉన్న‌ట్టు నివేదిక తెలిపింది. ఒక నిర్థిష్ట స‌మ‌యంలో జన్మించిన వారిలో ప్రతి వెయ్యి మంది బాలురకు, బాలికల సంఖ్యను లింగనిష్పత్తి (SRB) గా  న‌మోద‌న‌ట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) పేర్కొంటారు. 

2020లో అత్యల్ప లింగ నిష్పత్తి మణిపూర్ లో న‌మోద‌యింది.  ఇక్క‌డ  1000 మంది బాలుర‌కు కేవ‌లం 880 మంది బాలిక‌లే ఉన్న‌రు. ఆ త‌రువాత దాద్రా& నగర్ హవేలీ,  డామన్& డయ్యూ లో898 మంది, గుజరాత్ లో 909, హర్యానాలో 916 మంది..  మధ్యప్రదేశ్ 921 మంది మహిళలు ఉన్నారు. 2019లో అత్యధిక లింగ నిష్పత్తి అరుణాచల్ ప్రదేశ్ లో న‌మోదైంది. ఇక్క‌డ ప్ర‌తి వేయి మంది బాలుర‌కు 1024 మంది బాలిక‌లు ఉన్నారు.  నాగాలాండ్ లో 1001, మిజోరాం 975 లో A&N దీవులు 965లో మంది బాలిక‌లు ఉన్న‌ట్టు నివేదించబడ్డాయి. అలాగే.. అత్యల్ప లింగ నిష్పత్తి గుజరాత్ లో 901, అస్సాంలో 903 మంది, మధ్యప్రదేశ్ లో 905 మంది జమ్మూ & కాశ్మీర్ లో 909 మంది బాలిక‌లు ఉన్న‌ట్టు నివేదిక తెలిపింది.

ఆ 4 రాష్ట్రాల డేటా లేదు

లింగ నిష్పత్తిపై మహారాష్ట్ర, సిక్కిం, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ల స‌మాచారం లేద‌ని నివేదిక పేర్కొంది. వారు చెప్పిన డేటాను 2019లో కూడా RGIకి అందించలేదు. 2019లోనూ ఆర్‌జిఐకి ఈ నాలుగు రాష్ట్రాలు సమాచారం ఇవ్వలేదు. జనాభాలో లింగ భేదాన్ని గుర్తించడానికి లింగ నిష్పత్తి ముఖ్యమైన అంశమని నివేదిక తెలిపింది. దేశంలో ఏ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 880 కంటే తక్కువ నమోదు కాలేదు.

శిశు మరణాలు

2020లో 1,43,379 శిశు మరణాలు నమోదయ్యాయని, గ్రామీణ ప్రాంతం వాటా 23.4% మాత్రమేనని, మొత్తం నమోదైన శిశు మరణాల్లో పట్టణ ప్రాంతం 76.6%గా ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశంలో చైతన్యం పెరుగుతున్నందున భ్రూణ హత్యలు కూడా తగ్గుతున్నాయని.. ఈ కారణంగా లింగనిష్పత్తి కూడా పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.  ఇప్పటికే అనేక చట్టాలు కూడా తెచ్చారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్