ఎంతకాలం పరారీలో ఉండగలడు? చట్టం శక్తివంతమైంది.. : అమృత్ పాల్ సింగ్ అరెస్టుపై అనురాగ్ ఠాకూర్ కీల‌క వ్యాఖ్య‌లు

Published : Apr 23, 2023, 04:09 PM IST
ఎంతకాలం పరారీలో ఉండగలడు? చట్టం శక్తివంతమైంది.. : అమృత్ పాల్ సింగ్ అరెస్టుపై అనురాగ్ ఠాకూర్ కీల‌క వ్యాఖ్య‌లు

సారాంశం

Amritpal Singh case: 2022 ఆగస్టులో అమృత్ పాల్ సింగ్ దుబాయ్ నుంచి ఒంటరిగా పంజాబ్ కు వచ్చాడు. అక్టోబర్ లో అమృత్ పాల్ జర్నైల్ సింగ్ భింద్రన్ వాలా విలేజ్ రోడ్ లోని 'వారిస్ పంజాబ్ దే' సంస్థకు కొత్త అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ఆయ‌న అరెస్టుపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. చ‌ట్టం చాలా శ‌క్తివంత‌మైన‌ద‌నీ, ఉగ్ర‌వాదాన్ని వ్యాప్తి చేసే వారిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని అన్నారు.

Anurag Thakur's comments on Amritpal Singh's arrest: పరారీలో ఉన్న మత బోధకుడు, ఖ‌లిస్తానీ మద్దతుదారుడు అమృత్ పాల్ సింగ్ మోగాలోని పంజాబ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. రోడే గ్రామంలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేసిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలోనే 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్పాల్ సింగ్ అరెస్టు తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ చట్టం శక్తివంతమైనదని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

వివరాల్లోకెళ్తే.. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్ పరారీలో ఉన్నాడు. పంజాబ్ లోని మోగా జిల్లాలో 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పంజాబ్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ.. "పరారీలో ఉన్న వ్యక్తి ఎంతకాలం పరారీలో ఉండగలడు? చట్టం శక్తివంతమైనది. ఉగ్రవాదాన్ని, భయాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పంజాబ్ కు ఈ విష‌యంలో కొంచెం సమయం పట్టింది, త్వరగా చేసి ఉంటే ఇంకా బాగుండేది" అని అన్నారు.

 

 

అరెస్టుకు కొన్ని గంటల ముందు పంజాబ్ లోని మోగాలోని రోడేవాల్ గురుద్వారాలో 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్ పాల్ సింగ్ త‌న మ‌ద్ద‌తుదారుల‌ను ఉద్దేశించి ప్రసంగించారు. "అమృత్ పాల్ సింగ్ శనివారం రాత్రి రోడేవాల్ గురుద్వారాకు వచ్చారు. ఆదివారం ఉదయం 7 గంటలకు లొంగిపోతానని ఆయనే స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చారు" అని మోగాలోని రోడేవాల్ గురుద్వారాకు చెందిన సింగ్ సాహిబ్ జ్ఞాని జస్బీర్ సింగ్ రోడే తెలిపిన‌ట్టు ఏఎన్ఐ నివేదించింది. కాగా, అమృత్ పాల్ అనుచరుల్లో ఒకరైన లవ్ ప్రీత్ తూఫాన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమృత్ పాల్ మద్దతుదారులు ఫిబ్రవరి 23న అమృత్ సర్ లోని అజ్నాలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు.

ఈ క్ర‌మంలోనే చోటుచేసుకున్న ప‌రిణామాల మ‌ధ్య పోలీసులు అమృత్ పాల్ సింగ్ ను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించారు. 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ పై పంజాబ్ పోలీసులు నెల రోజుల క్రితం లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ), నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ)ను సైతం జారీ చేశారు. అతని సహచరులను గతంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. రాడికల్ బోధకుడు, ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ ఇద్దరు సహాయకులను పంజాబ్ లోని మొహాలీలో ఏప్రిల్ 18న పంజాబ్, ఢిల్లీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ లో అరెస్టు చేశారు.

ఏప్రిల్ 15న పంజాబ్ పోలీసులు అతని సన్నిహితుడు జోగా సింగ్ ను ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిర్హింద్ లో అరెస్టు చేశారు. పంజాబ్ పోలీసులు, దాని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం నిర్వహించిన ఆపరేషన్ లో ఖలిస్థాన్ అనుకూల నాయకుడు పాపల్ప్రీత్ సింగ్ ను, అత‌ని మరో సన్నిహితుడుని ఏప్రిల్ 10 న అరెస్టు చేసిన‌ట్టు అధికార వ‌ర్గాలు తెలిపాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu
Top 5 South Indian dishes : ప్రాంతాల పేర్లతో ప్రపంచానికి పరిచయమైన దక్షిణాది వంటకాలు ఇవే..!