పాక్‌లో భారత క్షిపణి పేలుడు: దర్యాప్తునకు ఆదేశించామన్న రాజ్‌నాథ్ సింగ్

Published : Mar 15, 2022, 01:34 PM IST
పాక్‌లో భారత క్షిపణి పేలుడు: దర్యాప్తునకు ఆదేశించామన్న రాజ్‌నాథ్ సింగ్

సారాంశం

పాకిస్థాన్ లో భారత్ క్షిపణి  పొరపాటున  పేలడంపై   రాజ్యసభలో కంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం నాడు ప్రకటన చేశారు.

న్యూఢిల్లీ: ఈ నెల 9వ తేదీన ప్రమాదవశాత్తు Pakistan భూభాగంలో భారత్ Missile  పేలుడు అంశంపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్టుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

మంగళవారం నాడు రాజ్యసభలో ఈ విషయమై Rajnath Singh ప్రకటన చేశారరు. భారత క్షిపణి వ్యవస్థ అత్యంత సురక్షితమైందన్నారు.ఈ నెల 9వ తేదీన క్షిపణి యూనిట్ సాధారణ నిర్వహణ తనిఖీలు చేస్తున్న సమయంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో అనుకోకుండా ఓ క్షిపణి విడుదలైందని మంత్రి  చెప్పారు.  ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుందన్నారు.  క్షిపణి ఎలా ప్రయోగించబడిందనే విషయమై విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. ఈ క్షిపణి పాక్ భూభాగంలో పడిందన్నారు. ఈ ఘటన దురదృష్టకరమైందిగా మంత్రి చెప్పారు.   ఈ క్షిపణి ప్రయోగంతో ఎలాంటి నష్టం జరగలేదని మంత్రి వివరించారు.

తమ కార్యకలాపాలు, నిర్వహణ, తనిఖీలు మూల్యాంకనం చేయబడే ప్రామాణిక ఆపరేటింగ్ విధాల పరిమితిని అనుసరించి నిర్వహిస్తామన్నారు.  ఆయుధ వ్యవస్థల భద్రత, భద్రతలో ఏమైనా అలసత్వం ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ తరహా వ్యవస్థలను నిర్వహించడంలో తమ సాయుధ బలగాలకు మంచి అనుభవం ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?