మణిపూర్ సీఎం రాజీనామాపై హై డ్రామా.. వేలాది మంది నిరసన తెలపడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బీరెన్ సింగ్

Published : Jun 30, 2023, 04:52 PM IST
మణిపూర్ సీఎం రాజీనామాపై హై డ్రామా.. వేలాది మంది నిరసన తెలపడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బీరెన్ సింగ్

సారాంశం

మణిపూర్ సీఎం రాజీనామా చేస్తారని ఉదయం నుంచి ప్రచారం సాగింది. అయితే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వేలాది మంది నిరసనకారులు బీరెన్ సింగ్ నివాస సమీపానికి చేరుకున్నారు. సీఎం కాన్వాయ్ రాజ్ భవన్ కు వెళ్లకుండా అడ్డుకున్నారు. కొంత సమయం తరువాత తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ ఎన్ సింగ్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో రాజధాని ఇంఫాల్ లో హై వోల్టేజ్ డ్రామా చోటు చేసుకుంది. సీఎం నివాసం నుంచి కాన్వాయ్ ను రాజ్ భవన్ వైపు వెళ్లకుండా వేలాది మంది నిరసనకారులు అడ్డుకున్నారు. పలువురు మహిళా నేతలు సీఎం ఇంట్లోకి వెళ్లారు. అయితే బీరెన్ సింగ్ రాజీనామా చేయడం లేదని బయటకు వచ్చిన తరువాత వారు చెప్పారు. దీంతో జనం మెల్లమెల్లగా ఆయన నివాసం నుంచి వెనుదిరిగారు. కాగా.. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. 

సీఎం రాజీనామా లేఖను టైప్ చేశారని, కానీ దాన్ని చింపివేయడానికి ఆయన మద్దతుదారులను ఒప్పించారని అక్కడున్న పలువురు నాయకులు తెలిపారు. కాగా.. అంతకు ముందు బీరేన్ సింగ్ రాజీనామా చేయకూడదని డిమాండ్ చేస్తూ వందలాది మంది యువకులు నల్ల చొక్కాలు ధరించి, మహిళలు సీఎం నివాసం ముందు బైఠాయించారు. గురువారం రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ఉదయం నుంచి ఇంఫాల్ లో జోరుగా ప్రచారం జరిగింది.

కంగ్పోక్పి జిల్లాలో భద్రతా దళాలకు, అనుమానిత అల్లర్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృతుల సంఖ్య శుక్రవారం మూడుకు చేరిందని, మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అధికారులు తెలిపారు. హరోతేల్ గ్రామంలో గురువారం సాయుధ అల్లర్లు కాల్పులకు తెగబడ్డాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు భద్రతా దళాల సిబ్బంది పకడ్బందీగా స్పందించారని ఆర్మీ తెలిపింది.

ఈశాన్య రాష్ట్రంలో మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీలు ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. గిరిజనులు - నాగాలు మరియు కుకిలు - జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు మరియు కొండ జిల్లాల్లో నివసిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu