తమిళనాడు-కర్ణాటక బోర్డర్‌లో ఉద్రిక్తత.. హైఅలర్ట్

Published : Aug 07, 2018, 09:11 PM ISTUpdated : Aug 07, 2018, 09:15 PM IST
తమిళనాడు-కర్ణాటక బోర్డర్‌లో ఉద్రిక్తత.. హైఅలర్ట్

సారాంశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో దేశవిదేశాల్లోని తమిళులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి మరణవార్తతో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మరణంతో దేశవిదేశాల్లోని తమిళులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

కర్ణాటక నుంచి తమిళనాడు వైపు.. తమిళనాడు నుంచి కర్ణాటక వైపు వెళ్లే బస్సులను ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి.. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. బెంగళూరులో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Femina Miss India ఫెమినా మిస్ ఇండియా 2026 విజేతగా గోవా బ్యూటీ సాధ్వి సతీష్ సైల్| Asianet News Telugu
Summer Trip : అందమైన దీవులు, చల్లచల్లని బీచ్ లు.. సమ్మర్ ట్రిప్ కు పర్పెక్ట్ డెస్టినేషన్..!