ట్రెక్కింగ్ కి వెళ్లి..45మంది మిస్సింగ్

Published : Sep 25, 2018, 11:10 AM ISTUpdated : Sep 25, 2018, 11:12 AM IST
ట్రెక్కింగ్ కి వెళ్లి..45మంది  మిస్సింగ్

సారాంశం

భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

హిమాచల్ ప్రదేశ్ లో ట్రెక్కింగ్ కి వెళ్లిన 45మంది సభ్యుల బృందం మిస్సయ్యింది. గత ఐదు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో 45మంది ట్రెక్కింగ్ కి వెళ్లారు.

వారిలో వీరిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(రూర్కీ)కి చెందిన 35 మంది విద్యార్థులు ఉన్నారు. భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు ఈ విషయమై స్పందిస్తూ.. హమ్టా మార్గం గుండా వెళ్లి తిరిగి మనాలి చేరుకోవాలని వారంతా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు.

అయితే.. భారీ వర్షాలు, మంచు తుఫాన్ కారణంగా వీరు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. వీరి ఆచూకీ కోసం అధికారులు రెస్క్యూ సిబ్బందిని ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. 

PREV
click me!

Recommended Stories

Viral Video : మూత్రంతో కళ్లు కడుక్కుంటే మంచిదా..? ఈమె చేసింది కరెక్టేనా..? డాక్టర్లు ఏమంటున్నారంటే
పాకిస్థాన్‌కు ఇక ద‌బిడి దిబిడే.. కీల‌క నిర్ణ‌యం తీసుకున్న భార‌త ఆర్మీ. రంగంలోకి ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్స్‌