తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

Published : Jun 20, 2023, 12:18 PM IST
తమిళనాడులో భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

సారాంశం

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పలు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే చెన్నైతో పాటు మరి కొన్ని జిల్లాలో నేడు తెల్లవారుజామున వర్షాలు కురిసినప్పటికీ పాఠశాలలు యథావిథిగా కొనసాగుతున్నాయి. 

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపత్తూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున చెన్నైలో భారీ వర్షం కురిసింది. అయితే పాఠశాలలు మాత్రం మూతపడలేదు. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని ప్రభుత్వ నివేదికలు వెల్లడించాయి.

పాటలు నేర్చుకునేందుకు చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్తే.. ఐదేళ్లుగా యువతిపై అత్యాచారం..

అలాగే కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్లు కలైసెల్వి మోహన్, డాక్టర్ అల్బీ జాన్ వర్గీస్, రాహుల్ నాథ్ తెలిపారు. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ చెన్నైకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా నీరు నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ లు, రహదారులు మూసుకుపోవడం, నదులు, సరస్సుల్లో నీటి మట్టాలు పెరగడం, చెట్లు కూలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

తమిళనాడులోని అరియలూరు, కడలూరు, మైలదుతివారి, తిరువారూర్, నాగపట్నం, వేలూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరువణ్ణామలై, తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాల్లో, పుదుచ్చేరి, కరైకల్ జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
 

PREV
click me!

Recommended Stories

Coconut : ఫ్లైట్‌లో ఎండు కొబ్బరి పై నిషేధం ఎందుకు?
PM Modi Grand Roadshow: కేరళ పర్యటనలో మోదీకిగుర్తుండిపోయేలా ఘన స్వాగతం | Asianet News Telugu