నిరుద్యోగుల నిర‌స‌న‌ల్లో స్పృహతప్పి ప‌డిపోయిన‌ ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Published : Feb 10, 2023, 05:33 PM IST
నిరుద్యోగుల నిర‌స‌న‌ల్లో స్పృహతప్పి ప‌డిపోయిన‌ ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

సారాంశం

Dehradun: ఉత్త‌రాఖండ్ లో నిరుద్యోగ యువకులపై పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆందోళనకు దింగింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ నిర‌స‌న తెలుప‌డానికి వ‌చ్చిన రాష్ట్ర మాజీ సీఎం హరీశ్ రావత్.. ఒక్క‌సారిగా స్పృహతప్పి ప‌డిపోయారు. ఆయ‌న‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించ‌డంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Former Uttarakhand Chief Minister Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఆరోగ్యం శుక్రవారం అకస్మాత్తుగా క్షీణించింది. ఆయ‌న‌ను ఆస్పత్రికి తరలించారు. డెహ్రాడూన్ లో నిరుద్యోగ యువత చేపట్టిన నిరసనలో మాజీ సీఎం పాల్గొన్నారు. ధర్నాలో కూర్చొని స్పృహతప్పి పడిపోయారు. ఈ క్ర‌మంలోనే రావ‌త్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వైద్యులు ప‌రీక్షిస్తున్నార‌ని స‌మాచారం. 

 

రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అవకతవకలపై నిరుద్యోగ యువ‌కులు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం గాంధీబాగ్ లో జరిగిన నిరసనలో రాష్ట్ర నియామక పరీక్షల కమిషన్లు యూకేపీఎస్సీ, యూకేఎస్ ఎస్ సీల్లో సంస్కరణలు తీసుకురావాలని నిరుద్యోగ సంఘాలు, కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ డిమాండ్ చేశాయి. కమిషన్ నిర్వహించే పరీక్షల్లో రిగ్గింగ్ జరుగుతోందని అభ్యర్థులు ఆరోపించారు. మోసాల కారణంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు రద్దవుతున్నాయ‌ని పేర్కొన్నారు. 

 

నిరుద్యోగులు, విద్యార్థుల డిమాండ్లు  ఇవే.. 

రాష్ట్రంలో పోలీస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్వారీ, ఆర్వో, ఏఆర్వో, పీసీఎస్ జే, అధికార ప్రతినిధి ఏఈ, లోయర్ పీసీఎస్, అప్పర్ పీసీఎస్, జేఈ పరీక్షలకు హాజరైన యువకులు ఇంకా తమ నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. కమిషన్ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ నియామ‌క బోర్డుల్లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావాల‌ని కోరుతున్నారు. 

తీవ్ర రూపం దాల్చిన నిర‌స‌న‌లు 

నిరుద్యోగుల నిర‌స‌న‌ ప్రదర్శన శుక్రవారం తీవ్రరూపం దాల్చింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు వీధుల్లోకి వచ్చి పరిపాలన, నియామక విభాగాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి నిరసనగా నిరుద్యోగ సంఘం శుక్ర‌వారం ఉత్తరాఖండ్ బంద్ ప్రకటించింది. నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు, విజిల్ బ్లోయర్ బాబీ పన్వర్ పై పోలీసులు లాఠీచార్జి చేయగా, బాబీని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

 

రాజధాని డెహ్రాడూన్ లోని ఘంటాఘర్ ప్రాంతంలో అధికార యంత్రాంగం 144 సెక్షన్ విధించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లో శాంతిభద్రతల పరిస్థితి, లాఠీఛార్జ్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అన్ని వాస్తవాలు, పరిస్థితులను పరిశీలించిన తర్వాత సమగ్ర దర్యాప్తు నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి.. ఐదు రాష్ట్రాల్లో ఎవరిది హవా? సౌత్‌లో విజయ్ ఎంట్రీతో మారిన లెక్కలు !
Modi Visits Kashi Vishwanath Temple:వారాణసి శ్రీకాశీవిశ్వనాథ ఆలయంలో మోదీ పూజలు| Asianet News Telugu