నిశ్చితార్థం రద్దు చేశారని.. యువతిని దారుణంగా హతమార్చాడు..

Published : Jul 11, 2023, 04:13 AM IST
నిశ్చితార్థం రద్దు చేశారని.. యువతిని దారుణంగా హతమార్చాడు..

సారాంశం

హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో ఓ బాలికను కత్తితో పొడిచి చంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కస్టడీకి తరలించారు.  

హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపాడు. కొద్ది రోజుల క్రితమే వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అయితే అమ్మాయి తల్లిదండ్రులు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో ఆ యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. నిందితుడు యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఘటనకు ఉపయోగించిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటన మౌలాహెడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగింది. 19 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడని, దీంతో బాలిక అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రామ్‌కుమార్ (23 ఏళ్లు)గా గుర్తించారు.

మరణించిన బాలిక తన కుటుంబంతో సహా మౌలాహెడ గ్రామంలో నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.నిందితుడైన యువకుడు రాజ్‌కుమార్ కూడా మౌలాహెడ గ్రామంలో నివసిస్తున్నాడు. ప్రాథమికంగా వారిద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లా వాసులు. వారిద్దరికీ వారి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల యువతి కుటుంబ సభ్యులు వారి నిశ్చితార్థాన్ని రద్దు చేశారు. ఆ కోపంతో ఆ యువకుడు అమ్మాయిపై దాడి చేశారు. కడుపులో కత్తితో దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ ఘటనలో నిందితులు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం నిందితుడి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu