ఆహార ఖర్చులను స్వయంగా భరిస్తున్న ప్రధాని మోదీ.. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదని ఆర్టీఐ ద్వారా వెల్లడి..

Published : Aug 31, 2022, 02:09 PM ISTUpdated : Aug 31, 2022, 02:17 PM IST
ఆహార ఖర్చులను స్వయంగా భరిస్తున్న ప్రధాని మోదీ.. ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయడం లేదని ఆర్టీఐ ద్వారా వెల్లడి..

సారాంశం

పార్లమెంటు సభ్యులకు, కేంద్ర మంత్రులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా బయటకు వచ్చిన ఓ విషయం మాత్రం ఆశ్చర్యానికి గురిచేయక మానదు. అదేమిటంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఆహార ఖర్చులను స్వయంగా భరిస్తున్నారు.

పార్లమెంటు సభ్యులకు, కేంద్ర మంత్రులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తోందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా బయటకు వచ్చిన ఓ విషయం మాత్రం ఆశ్చర్యానికి గురిచేయక మానదు. అదేమిటంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ఆహార ఖర్చులను స్వయంగా భరిస్తున్నారు. ప్రభుత్వ బడ్జెట్ నుంచి ప్రధాని భోజనానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. ఈ విషయం ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఈ మేరకు ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు ప్రధానమంత్రి కార్యాలయం ఈ సమాచారం ఇచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయ కార్యదర్శి బినోద్ బిహారీ సింగ్ ఆర్టీఐకి సమాధానమిస్తూ.. ప్రభుత్వ బడ్జెట్ నుంచి ప్రధాని ఆహారం కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబడలేదన చెప్పారు. 

ఇక, ప్రధాన మంత్రి నివాసం (పీఎం ఆవాస్) కేంద్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా రక్షించబడుతుంది. అయితే వాహనాల బాధ్యత ఎస్పీజీ చూసుకుంటుంది. జీతం సంబంధిత సమాచారం కూడా ఆర్టీఐలో కోరగా.. మాన్యువల్‌ను మాత్రమే సూచిస్తోంది.. నిబంధనల ప్రకారం ఇంక్రిమెంట్ చేయాలని సమాచారం ఇవ్వబడింది.


ఇక, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2015 మార్చి 2వ తేదీన బడ్జెట్ సెషన్ సందర్భంగా, ఆయన పార్లమెంటు హౌస్ మొదటి అంతస్తులోని క్యాంటీన్‌కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో శాఖాహార భోజనం కోసం ప్రధాని మోదీ స్వయంగా రూ.29 చెల్లించారు. అయితే.. ఇప్పుడు పార్లమెంట్ హౌస్ క్యాంటీన్‌లో శాఖాహారం థాలీ ధర రూ.100గా ఉంది. ఇక, పార్లమెంట్‌లో నడుస్తున్న క్యాంటీన్‌కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా  2021 జనవరి 19న పార్లమెంటు క్యాంటీన్‌లో ఎంపీలకు ఇచ్చే సబ్సిడీని రద్దు చేశారు. 2021కి ముందు పార్లమెంటు క్యాంటీన్లలో సబ్సిడీల కోసం రూ. 17 కోట్లు ఖర్చు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu