గాంధీ 150వ జయంతి... ప్రధాని మోదీ నివాళి

By telugu teamFirst Published Oct 2, 2019, 8:23 AM IST
Highlights

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉన్నారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.


దేశవ్యాప్తంగా జాతిపిత మహాత్మాగాంధీ 150 జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రజలు జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకుంటున్నారు. కాగా... దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సైతం మహాత్మునికి శ్రద్ధాంజలి ఘటించారు.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాళులర్పించిన ప్రముఖుల్లో ఉన్నారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్య సంగ్రామ సారథిగా జనసంద్రాన్ని కదిదలించిన మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు దేవశ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

click me!