అర్థరాత్రి పియానో వాయించిన తండ్రి.. వద్దని వారించిన కూతురితో...

Published : Jul 25, 2020, 07:17 AM ISTUpdated : Jul 25, 2020, 07:30 AM IST
అర్థరాత్రి పియానో వాయించిన తండ్రి.. వద్దని వారించిన కూతురితో...

సారాంశం

బుధవారం రాత్రి బాగా తాగి పియానో వాయించడం మొదలు పెట్టాడు. అయితే టైం అర్థరాత్రి అయిందని ఈ సమయంలో పియానో వాయించడం వల్ల తనకు, తమ్ముడికి నిద్ర పట్టడం లేదని కూతురు వారించింది.

పియానో వాయించడంతో తండ్రీ, కూతుళ్ల మధ్య తలెత్తిన గొడవ.. చివరకు ఒకరి ప్రాణాన్ని బలిగొన్నది. అర్థరాత్రి తండ్రి పియానో వాయిస్తుంటే.. దాని వల్ల తమకు నిద్రపట్టడం లేదని కూతురు వారించింది. ఈ క్రమంలో జరిగిన గొడవలో తండ్రి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంగటన బెంగళూరులో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరకు చెందిన సప్తక్ బెనర్జీ (46) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తొమ్మది ఏళ్ల క్రితం భార్య చనిపోయింది. 15 ఏళ్ల తన కూతురు, 9 ఏళ్ల కొడుకుతో బెంగళూరులోని బన్నెరగట్ట రోడ్‌లో ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. ఈమధ్యే ఉద్యోగం కూడా మానేశాడు. అనంతరం తాగుడుకు అలవాటు పడ్డాడు.

బుధవారం రాత్రి బాగా తాగి పియానో వాయించడం మొదలు పెట్టాడు. అయితే టైం అర్థరాత్రి అయిందని ఈ సమయంలో పియానో వాయించడం వల్ల తనకు, తమ్ముడికి నిద్ర పట్టడం లేదని కూతురు వారించింది. అయినా కూడా అతడు పియానో వాయిస్తూనే ఉన్నాడు. కొన్ని గంటల తర్వాత ఆపేయమని కూతురు మళ్లీ అడిగింది. వెంటనే తండ్రీ-కూతుళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.

‘‘బెనర్జీ రెండు కత్తెరలు తీసుకుని తన కూతురిని చంపేందుకు ప్రయత్నించాడు. దీన్ని కూతురు ప్రతఘటించింది. అయితే మత్తులో ఉన్న బెనర్జీ కిందపడిపోతున్న క్రమంలో ఆ కత్తెరలు కడుపులో గుచ్చుకున్నాయి. అక్కడికక్కడే బెనర్జీ మృతి చెందాడు. వెంటనే కూతరు తమ బంధువులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వారు మాకు సమాచారం అందించారు’’ అని సౌత్ ఈస్ట్ డీసీపీ శ్రీనాథ్ మహదేవ్ జోషి తెలిపారు. కాగా బాలికపై ఐపీసీలోని 304 సెక్షన్ ప్రకారం కేసు ఫైల్ చేశామని ఆయన పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Indian Population in USA: అమెరికాలో ఇండియన్స్ అడ్డా.. ఈ 5 నగరాల్లోనే ఎక్కువ మంది.. ఎందుకో తెలుసా?
చెన్నై లో నూతన భవనాలను ప్రారంభించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Visits Perambur