ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసులు మృతి..

By Sumanth KanukulaFirst Published Dec 1, 2022, 5:32 PM IST
Highlights

ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌‌కు చెందినవారిగా  గుర్తించారు. 

ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌‌కు చెందినవారిగా  గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివరాలు.. మృతులు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి పూరీ వైపు వెళ్తుండగా.. బడాపోఖరి ప్రాంతంలో జాతీయ రహదారి 16పై రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వారు ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.  ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. 

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో విశాఖకు చెందిన బ్యూటీషియన్ మారియా ఖాన్(24), ఆర్టిస్టులు కబీర్, లక్ష్మీ, ఫోటోగ్రాఫర్ రాఖీ ఉన్నారు. వీరు భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 
 

click me!