భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేయడం కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. మాలవీయ రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పాలని, ఆ ట్వీట్ ను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.
భారత్ జోడో యాత్ర సందర్భంగా చోటు చేసుకున్న ఓ పరిణామం కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్వీట్ల యుద్ధానికి దారి తీసింది. ఈ యాత్ర బుధవారం నుహ్లోని ముండ్కా సరిహద్దు నుంచి హర్యానాలోకి ప్రవేశించింది. అయితే ఈ సమయంలో రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీనిని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయా ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ ను డిలీట్ చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కప్బోర్డ్లో కూతురు మృతదేహం.. మంచం కింద తల్లి శవం.. గుజరాత్ లోని ఆస్పత్రిలో దారుణం..
ఏం జరిగింది ?
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్ అహిర్వార్ కూడా పాల్గొన్నారు. ఆయన వెంట కలిసి నడిచారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఒక్క సారిగా ఆగిపోయారు. తన షూ లో ఏదో సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో జితేంద్ర సింగ్ మోకాళ్లపై కూర్చొని షూ లేస్ సరి చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తరువాత ఆ పాదయాత్ర మళ్లీ కొనసాగింది.
As incharge of ruling BJP’s National Info Dept your tweet is a complete lie and defamatory.
The fact is that after being pointed out by Rahul ji upon my request he paused briefly so that I could tie my own shoe laces.
Delete the tweet and apologise to RG or face legal action https://t.co/HDXVii09bg
అయితే దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. అందులో ‘‘ మాజీ కేంద్ర మంత్రి భన్వర్ జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ షూలేస్లను కట్టడానికి మోకరిల్లారు. కానీ రాహుల్ గాంధీ అహకారంగా తన షూ లేస్ తానే కట్టుకోకుండా, అతడికి సాయం చేయకుండా వీపు తడుముకుంటున్నాడు. ’’ అని పేర్కొన్నాడు. కొంత సమయం తరువాత మళ్లీ ‘‘ఖర్గే జీ ఇదేం పద్దతి ? కాంగ్రెస్లో తరాలకు కొరతలేదు ’’ అని హిందీలో ట్వీట్ చేశారు.
సహజీవనానికి కనీస వయస్సు 18 ఏళ్లే.. తగ్గించే యోచన లేదన్న కేంద్రం
అమిత్ మాలవీయా చేసిన ఈ ఆరోపణపై జితేంద్ర సింగ్ అల్వార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ అధికార బీజేపీ జాతీయ సమాచార శాఖ ఇన్ఛార్జ్గా మీ ట్వీట్ పూర్తిగా అబద్ధం. అలాగే పరువు నష్టం కలిగించేలా ఉంది. వాస్తవంగా అక్కడ నా షూ లేస్ లు విడిపోయయని రాహుల్ జీ చెప్పారు. దీంతో ఆయన కొంత సేపు అక్కడ ఆగారు. ఆ సమయంలో నా షూ లేస్ ను నేను కట్టుకున్నాను. ఆ ట్వీట్ను డిలీట్ చేసి, రాహుల్ గాంధీకి క్షమాపణలు చెప్పండి. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
Hey fake news peddler here’s a pic of Rahul Gandhi Ji’s shoe, which is laceless!!
You have been caught lying yet again, but since you are authorised by BJP Prez JP Nadda and PM Modi to lie everyday - all 3 of you owe an apology to
STOP LYING pic.twitter.com/qCylAXwFZ8
అమిత్ మాలవీయాపై ట్వీట్ పై సుప్రియా శ్రీనాటే కూడా స్పందించారు. రాహుల్ గాంధీకి లేస్ లేని షూ ఉందని తెలిపారు. ‘‘ హే ఫేక్ న్యూస్ పెడ్లర్ అమిత్ మాలవీయ. ఇదిగో లేస్ లేని రాహుల్ గాంధీ షూ ఫోటో ’’ అంటూ ఆ ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘‘ మీరు మరోసారి అబద్ధాలు చెబుతూ పట్టుబడ్డారు. కానీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పీఎం మోడీ మీకు ప్రతిరోజూ అబద్ధాలు చెప్పే అధికారం ఇచ్చారు. కాబట్టి మీరు ముగ్గురూ రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలి.’’ అని ట్వీట్ చేశారు. నకిలీ వార్తల సూత్రధారి అమిత్ మాల్వియా మరో ట్వీట్ లో మీ ట్వీట్ను తొలగించండి. భారత్ జోడో యాత్ర సక్సెస్తో మీకు పిచ్చి పట్టిందా ? ’’ అంటూ పేర్కొన్నారు.
సీనియర్ నటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.. అసలేం జరిగింది..?
కాగా.. భారత్ జోడో యాత్ర రాజస్థాన్ నుంచి బుధవారం హర్యానాలోకి ప్రవేశించింది. ఈ సమయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఆ రాష్ట్ర పార్టీ చీఫ్ గోవింద్ సింగ్ దోతసార కూడా రాహుల్ గాంధీతో కలిసి హర్యానాలోకి అడుగుపెట్టారు. వారికి రాష్ట్ర సరిహద్దుల్లో హర్యానా ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా, రణదీప్ సింగ్ సూర్జేవాలా, కుమారి సెల్జా, దీపేందర్ సింగ్ హుడా స్వాగతం పలికారు. ఈ యాత్రలో హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, రాష్ట్ర ఇన్ఛార్జ్ శక్తిసిన్హ్ గోహిల్ కూడా పాల్గొన్నారు.