జమిలి ఎన్నికలు అసాధ్యమంటున్న సీఎం

Published : Jul 09, 2018, 01:52 PM IST
జమిలి ఎన్నికలు అసాధ్యమంటున్న సీఎం

సారాంశం

2019లో కాదు కదా.. 2024లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. 2019లో కాదు కదా.. 2024లో కూడా ఈ ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పని కాదని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సైద్ధాంతికంగా జమిలి ఎన్నికలకు అనుకూలమని, కానీ ప్రస్తుతం ఆ ఎన్నికల నిర్వహణకు అలాంటి పరిస్థితులు ఏమీలేవని సీఎం నితీశ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది.

కాగా.. ఈ అభిప్రాయం పట్ల పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు సంఘీభావం తెలుపగా..మరికొందరు వ్యతిరకతను వ్యక్తం చేశారు.  అయితే ఈ అంశంపై న్యాయ కమీషన్ ముందు ఆదివారం కొన్ని పార్టీలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. జమిలి ఎన్నికల నిర్వహణకు అనేక అంశాల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉంటుందని, భవిష్యత్తులో ఆ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తే బాగుంటుందని సీఎం నితీశ్ అభిప్రాయపడ్డారు. బీహార్‌లో మాత్రం జేడీయూ, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తాయన్నారు. కానీ ఇతర రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై ఏమీ చెప్పలేమన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu