ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం.. ఐదుగురు మృతి (వీడియో)

Published : Jul 24, 2018, 04:10 PM ISTUpdated : Jul 24, 2018, 04:21 PM IST
ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం.. ఐదుగురు మృతి (వీడియో)

సారాంశం

 లోకల్‌ ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ఆరుగులు యువకులు మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

చెన్నై : లోకల్‌ ట్రైన్‌లో ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడి ఆరుగులు యువకులు మృతి చెందగా... మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చెన్నై సమీపంలోని పరంగిమలై స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. చెన్నై బీచ్‌ స్టేషన్‌ నుంచి తిరుమలపూర్‌కు లోకల్‌ ట్రైన్‌ బయల్దేరగా.. ప్రయాణీకుల రద్దీతో కొంతమంది ఫుట్‌బోర్డ్‌లో నిల్చున్నారు. మార్గం మధ్యలో విద్యుత్‌ స్తంభం తగలడంతో వారంతా జారిపడ్డారని రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే రద్దీ వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని తోటి ప్రయాణికులు వాపోయారు.

                         

https://www.mynation.com/news/five-dead-after-falling-off-moving-train-in-chennai-pcd70j

 

PREV
click me!

Recommended Stories

Mid Day Meal: మ‌ధ్యాహ్న భోజ‌నంలో చికెన్ బిర్యానీ.. ప‌రిశీలిస్తోన్న రాష్ట్ర ప్ర‌భుత్వం
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ఆమోదం.. ఈ బిల్లుతో ఏం జరగనుంది.?