న్యూఢిల్లీలో దారుణం: దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి

Published : Aug 30, 2023, 10:02 AM ISTUpdated : Aug 30, 2023, 10:06 AM IST
న్యూఢిల్లీలో  దారుణం: దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి

సారాంశం

న్యూఢిల్లీలో  బుధవారంనాడు తెల్లవారుజామున జరిగిన  కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరోకరు గాయపడ్డారు.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో బుధవారంనాడు జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.న్యూఢిల్లీలోని భజన్‌పుర ప్రాంతంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తిని  హర్‌ప్రీత్  గిల్ గా గుర్తించారు. దుండగులు కాల్పులకు దిగిన వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే  ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అతను మృతి చెందినట్టుగా ప్రకటించారు.

ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని  గోవింద్ సింగ్ గా గుర్తించారు. అతడికి లోక్‌నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మోటార్ బైక్ పై  ఈ ఇద్దరు వెళ్తున్న సమయంలో దుండగుడు అడ్డగించి కాల్పులు జరిపినట్టుగా  పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు