Delhi Rail Godown: రైల్వే గోడౌన్‌లో ఘోర‌ అగ్ని ప్ర‌మాదం.. భారీ న‌ష్టం !

Published : Apr 25, 2022, 12:19 AM IST
Delhi Rail Godown: రైల్వే గోడౌన్‌లో ఘోర‌ అగ్ని ప్ర‌మాదం.. భారీ న‌ష్టం !

సారాంశం

Delhi Rail Godown: నార్త్ ఢిల్లీలో ప్ర‌తాప్‌న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్‌కు స‌మీపంలోని స‌బ్జీ మండీ వ‌ద్ద గ‌ల రైల్వే గోడౌన్‌లో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఆదివారం సాయంత్రం 4.25 గంట‌ల‌కు ఈ ప్ర‌మాదం  సంభ‌వించింద‌ని ఢిల్లీ ఫైర్ స‌ర్వీస్ డైరెక్ట‌ర్ అతుల్ గార్గ్ చెప్పారు.          

Delhi Rail Godown: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో  ఆదివారం సాయంత్రం ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని సబ్జీ మండి వద్ద రైల్వే గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. మొత్తం 14 అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలు అదుపులోకి వచ్చినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది.

అగ్నిప్రమాదంలో ఎవ‌రికీ గాయాలు కాలేద‌ని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ప్రతాప్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని సబ్జీ మండి వద్ద ఉన్న రైల్వే గోడౌన్‌లో సాయంత్రం 4:25 గంటలకు మంటలు చెలరేగినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ స‌మాచారం తెలిసిన వెంట‌నే 14 అగ్నిమాప‌క యంత్రాలు ఘ‌ట‌నా స్థ‌లానికి త‌ర‌లించామ‌ని తెలిపారు. ప్ర‌మాదానికి కార‌ణాలు తెలియ రాలేద‌న్నారు. 

తొలుత రెండు ఫైరింజ‌న్లు పంపించారు. అటుపై ఏడు.. త‌ర్వాత మ‌రో ఏడుగు ఫైరింజ‌న్లు పంపించిన‌ట్లు అగ్ని మాప‌క ద‌ళ అధికారులు తెలిపారు. మొత్తం 16 అగ్నిమాప‌క యంత్రాలు మంట‌లు ఆర్పివేశాయి. భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించడంతో న‌ల్ల‌ని మ‌బ్బులు ఈ ప్రాంతాన్ని క‌మ్మేశాయి. ప్ర‌మాద కార‌ణాలు తెలియ‌కున్నా.. భారీ న‌ష్టం వాటిల్లి ఉంటుంద‌ని అధికారులు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

PREV
click me!

Recommended Stories

సీఎం విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా| CM Joseph Vijay Travels in Chennai Metro with Common People
చెన్నై మెట్రో పనులు పరిశీలించిన సీఎం విజయ్ | CM C. Joseph Vijay Reviews Chennai Metro Rail Works