నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఆందోళన:746 మంది రైతులపై కేసులు

Published : Feb 21, 2024, 04:21 PM ISTUpdated : Feb 21, 2024, 04:38 PM IST
నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఆందోళన:746 మంది రైతులపై కేసులు

సారాంశం

నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన  రైతులపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

న్యూఢిల్లీ: తమ డిమాండ్ల సాధన కోసం  నోయిడా అథారిటీ కార్యాలయం ముందు ఈ ఏడాది జనవరి  18న ఆందోళన నిర్వహించిన వారిపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  నోయిడా అథారిటీ కార్యాలయానికి తాళం వేసిన  746 మంది రైతులపై  పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ విషయమై  సంబంధిత కార్యాలయంలో పనిచేసే జేఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  జనవరి  23న కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. ఈ బూటకపు కేసును ఉపసంహరించుకోవాలని  సీఎంతో నిర్వహించిన సమావేశంలో రైతులు డిమాండ్ చేశారు. 

భారతీయ కిసాన్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుఖ్ వీర్ ఖలీఫాతో పాటు  746 మంది రైతులపై కేసు నమోదు చేశారు.  ఈ ఏడాది జనవరి  18న నోయిడా అధారిటీ కార్యాలయాన్ని లాక్ డౌన్ చేయడానికి రైతులు వచ్చారని  పేర్కొన్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన ఆందోళన నేపథ్యంలో  రైతులపై  పోలీసులు కేసు నమోదు చేశారు.నోయిడా అథారిటీ ముందు ఆందోళనకు దిగిన 746 మంది రైతులపై  పోలీసులు కేసు నమోదు చేశారు. నెల రోజుల తర్వాత ఈ విషయం వెలుగు చూసింది.

నోయిడా అథారిటీ కార్యాలయం ముందు నిరసనతో పాటు కార్యాలయానికి తాళం వేసిన ఆరోపణలతో  746 మంది రైతులపై  ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసుల అంశం వెలుగు చూడడంతో  కేసులను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.తమపై తప్పుడు కేసులు బనాయించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఈ ఏడాది జనవరి 18న నోయిడా అధారిటీ అధికారులకు వ్యతిరేకంగా  రైతులు నినాదాలు చేశారు. కార్యాలయాన్ని స్వాధీనం చేసుకొనే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఆందోళనకారులను వారించారు.  అయినా కూడ పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారు. ఈ సమయంలో  పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సమయంలో  ప్రవేశ ద్వారం వద్ద జాతీయ జెండాను అపవిత్రం చేశారనే ఆరోపణలు కూడ వచ్చాయి. లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులపై దాడి చేశారనే  ఆరోపణలు కూడ వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఎస్ఐ  ప్రదీప్ ద్వివేది, హెడ్ కానిస్టేబుల్ ప్రభాత్ సింగ్ లకు కూడ తీవ్ర గాయాలయ్యాయి. కొందరు అధికారుల గొంతు నొక్కడానికి కూడ  ప్రయత్నించారనే ఆరోపణలు కూడ వెలుగు చూశాయి. అంతేకాదు తొక్కిసలాట జరిగింది. 

అంతేకాదు ఈ సందర్భంగా చోటు చేసుకొన్నహింసాత్మక ఘటనలతో  నోయిడా డెవలప్ మెంట్ అథారిటీ ప్రాంతంలో నివసించే వారు  భయాందోళనలు వ్యక్తం చేశారు. కొందరు తమ వ్యాపార సంస్థలను మూసివేశారు.  ఈ గందరగోళం కారణంగా  ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు కూడ ఇబ్బందులు నెలకొన్నాయి.  ఈ కేసు విషయం వెలుగు చూడడంతో  భారతీయ కిసాన్ పరిషత్ జాతీయ అధ్యక్షుడు సుఖ్ వీర్ ఖలీఫా  స్పందించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి రహస్యంగా ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు.


 

PREV
click me!

Recommended Stories

Rajinikanth vs Kamal Haasan Comments on CM Vijay | Asianet News Telugu
Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu