'పాకిస్థాన్ అస్థిరత‌ భారత్‌కు ప్రమాదకరం' : ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన 

Published : May 11, 2023, 05:49 AM IST
'పాకిస్థాన్ అస్థిరత‌ భారత్‌కు ప్రమాదకరం' : ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన 

సారాంశం

తీవ్ర ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ మరో ఆందోళన చెలారేగింది.  పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి హింస, ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్థాన్ పరిస్థితిపై కశ్మీర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ అస్థితరత  భారత్ ప్రమాదకరమన్నారు.

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేసినప్పటి నుంచి హింస, ప్రదర్శనలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద అస్థిరత పరిస్థితులు నెలకొన్నాయి.తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాఠశాలలు మూసివేయబడ్డాయి. కాగా, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన తెరపైకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్‌కు కపట చరిత్ర ఉందని ఆయన అన్నారు. అయితే పాకిస్థాన్‌ ఆస్థిరత్వం భారత్‌కు ముప్పని పేర్కొన్నారు. 

'అస్థితరత పాకిస్థాన్‌ భారత్‌కు ప్రమాదకరం'

ఇటీవల ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..'దురదృష్టవశాత్తు.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి పాకిస్తాన్‌కు కపట చరిత్ర ఉంది. పాకిస్థాన్ మొదటి ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ కూడా హత్యకు గురయ్యారు. జుల్ఫికర్ అలీ భుట్టో, అతని కుమార్తె బెనజీర్ భుట్టోలు ఎలాంటి పరిస్థితులెద్కున్నారో తెలుసు. దురదృష్టవశాత్తు అస్థిరమైన పాకిస్తాన్ .. భారత్ కు ప్రమాదకరం. ఉపఖండంలో శాంతి నెలకొనేందుకు అవసరమైన సుస్థిర పాకిస్థాన్ కావాలి... ఆ దేశంలో పరిస్థితి త్వరలోనే మెరుగుపడ్డాలి'అని ఆశించారు.
 శుభాకాంక్షలు.

'పాకిస్థాన్‌లో పరిస్థితి ఏ విధంగానూ బాగా లేదు'

పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఫరూక్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పరిస్థితి ఏ విధంగానూ బాగోలేదని అన్నారు. అక్కడ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. బలూచిస్థాన్‌లో వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి సుస్థిరత చాలా అవసరం. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఆందోళన చెందుతున్నాను. అతను బాగా పాపులర్. అతను సురక్షితంగా ఉండనివ్వండి.పాక్ మన పొరుగు దేశం, ఏదిఏమైనా మంచి జరగాలని, ప్రజలు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఫరూక్ అబ్దుల్లా ఆశిస్తున్నారు.

 పాకిస్థాన్‌లో  కొనసాగుతున్న రచ్చ

ఇస్లామాబాద్ హైకోర్టు నుండి ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పాకిస్థాన్ అంతటా సందడి నెలకొంది. ఇమ్రాన్ మద్దతుదారులు విరుచుకుపడి ప్రధాన సైనిక భవనాలపై దాడి చేశారు. రాత్రంతా హింసాత్మక ప్రదర్శనలు కొనసాగాయి. జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు పలు చోట్ల కాల్పులు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇమ్రాన్ మద్దతుదారులు లాహోర్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రైవేట్ నివాసానికి , కార్ప్స్ కమాండర్ ఇంటికి నిప్పంటించారు. బ్యాంకులను లూటీ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌