మరికొద్దిసేపట్లో రైతులతో 8వ విడత చర్చలు: ఈసారైనా ఫలించేనా..?

Siva Kodati |  
Published : Jan 08, 2021, 02:35 PM IST
మరికొద్దిసేపట్లో రైతులతో 8వ విడత చర్చలు: ఈసారైనా ఫలించేనా..?

సారాంశం

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు రైతు సంఘాల నేతలు. కాసేపట్లో రైతులతో 8వ విడత కేంద్రం చర్చలు జరుపుతోంది. 40 రైతు సంఘాల నేతలు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌కు చేరుకున్నారు రైతు సంఘాల నేతలు. కాసేపట్లో రైతులతో 8వ విడత కేంద్రం చర్చలు జరుపుతోంది. 40 రైతు సంఘాల నేతలు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రద్దు కాకుండా ఏదైనా ఓకే అంటోంది కేంద్రం. చర్చలకు ముందుకు అమిత్ షాతో సమావేశమయ్యారు వ్యవసాయ శాఖ మంత్రి తోమర్. చర్చల్లో పురోగతి వుంటుందనే ఆశాభావంతో వున్నామని.. చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయనే విశ్వాసంతో వున్నామన్నారు తోమర్.  

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

సింఘు సరిహద్దు ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే పలుసార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగినా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి చర్చలకు సిద్ధమవుతున్నారు

PREV
click me!

Recommended Stories

Vijay Election Campaign: రోడ్డుపై సైకిల్ తొక్కిన విజయ్ ఫ్యాన్స్ దూసుకురాగానే షాక్! | Asianet Telugu
Kedarnath Yatra Update: కేదార్ నాథ్ యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు| Asianet News Telugu