నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసు.. ముక్తార్ అన్సారీకి జీవిత ఖైదు

Published : Mar 13, 2024, 04:56 PM IST
నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసు.. ముక్తార్ అన్సారీకి జీవిత ఖైదు

సారాంశం

నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి జీవిత ఖైదు విధిస్తూ వారణాసి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తీర్పు వెలువరించింది. ఆయన 2021 నుంచి బందా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి జీవిత ఖైదు పడింది. పలు కేసుల్లో నిందితుడైన యూపీ మాజీ ఎమ్మెల్యేను పంజాబ్ జైలు నుంచి తీసుకువచ్చి 2021 నుంచి బందా జైలులో ఉంచారు. వారణాసి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అవనీష్ గౌతమ్ ఈ కేసులో తీర్పును వెలువరించారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్..

1990లో నకిలీ పత్రాల ఆధారంగా అన్సారీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయుధ లైసెన్స్ పొందారని సీబీసీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అన్సారీతో పాటు ఆయుధ క్లర్క్ గౌరీ శంకర్ లాల్ పై సీబీసీఐడీ ఎఫ్ ఐఆర్ నమోదు చేసింది.అప్పటి డీఎం అలోక్ రంజన్, ఎస్పీ దేవరాజ్ నగర్ ల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఆయుధ లైసెన్స్ తయారు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన చర్చలో అన్సారీ హాజరైనట్లు అన్సారీ తరఫు న్యాయవాది తెలిపారు.

1997లో బొగ్గు వ్యాపారి మహావీర్ ప్రసాద్ రంగుటాను చంపేస్తామని బెదిరించిన కేసులో అన్సారీకి 2023 డిసెంబర్ లో ప్రత్యేక కోర్టు ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అదే కేసులో జైలు శిక్షతో పాటు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు రూ.10 వేల జరిమానా విధించింది. వారణాసికి చెందిన రంగుటాను, అతడి ఇంటిని పేల్చివేస్తానని అన్సారీ బెదిరించాడు. ఈ కేసు విచారణను డిసెంబర్ 5న పూర్తి చేసిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అన్సారీని దోషిగా తేల్చిన ధర్మాసనం శిక్షను ఖరారు చేసింది.

రామేశ్వరం కేఫ్ పేలుడు.. ప్రధాన నిందితుడి సహచరుడు అరెస్ట్..

అన్సారీ బందా జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. కాగా.. మౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు అబ్బాస్ అన్సారీ సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

PREV
click me!

Recommended Stories

Ayodhya Ram Mandir Reopens After Lunar Eclipse:చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న అయోధ్య| Asianet Telugu
Total Lunar Eclipse: 2026 లో మొదటి చంద్రగ్రహణం చూసేందుకు ఎగబడ్డ జనం| Asianet News Telugu