రెండు పెళ్లిళ్లైన వ్యక్తితో వివాహేతరసంబంధం.. ఎఫైర్ కోసం ప్రియుడి రెండో భార్యను చంపిన ప్రియురాలు..

By Bukka SumabalaFirst Published Aug 12, 2022, 10:53 AM IST
Highlights

మధ్యప్రదేశ్ లో ఓ మహిళ వివాహేతర సంబంధం కోసం.. తన ప్రియుడి రెండో భార్యను దారుణంగా హతమార్చింది. విషయం బయటపడడంతో ఆమె కటకటాల్లోకి వెళ్లింది. 

మధ్యప్రదేశ్ : మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి.. ఆమెకు తెలియకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం...ఆ మహిళ తన ప్రియుడికోసం.. అతని రెండో భార్యను హతమార్చింది. ఇదేదో సీరియల్ కథో, సినిమా స్టోరీనో కాదు.. వందశాతం రియల్ స్టోరీ.. చదువుతుంటూనే కన్ ఫ్యూజింగ్ గా అనిపిస్తున్నా.. వాళ్లకు మాత్రం తమ సంబంధాల విషయం చాలా క్లారిటీ ఉంది. అయితేనేం.. చివరికి జీవితాలు నాశనం అయ్యాయి.

వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. పిల్లలను అనాథలుగా రోడ్డున పడేస్తున్నాయి. క్షణిక సుఖం కోసం.. తాపత్రాయం వారికి.. వారిని నమ్ముకున్నవారికీ జీవితాకాలపు శిక్షగా మారుతుంది. ఇలాంటి అనేక ఘటనలు ప్రతీరోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నా.. కొత్త ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ ప్రియుడి కోసం ప్రియురాలు.. ఎవరూ చేయని పని చేసింది. తన లవర్ రెండో భార్యను హత్య చేసి కటకటాల్లోకి వెళ్లింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది. 

ఆటో రిక్షా,బైక్‌ను ఢీకొట్టిన ఎస్‌యూవీ.. ఆరుగురు మృతి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్లుడిపై కేసు న‌మోదు

వివరాల్లోకి వెడితే.. దేవాస్ జిల్లాకు చెందిన బబ్లూకి 14 సంవత్సరాల కిందటే నీలం అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలున్నారు. కాగా, బబ్లూ.. తన మొదటి భార్యకు తెలియకుండా ఈ యేడాది మే నెలలో రాణి అనే మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే, భర్త ప్రవర్తనలో మార్పును గమనించిన నీలం.. అతడిని నిలదీసింది. పెళ్లి విషయం తెలిసి.. వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 

ఇది ఇలా నడుస్తుండగా.. ఓ రోజు బంగారం కొనేందుకు బబ్లూ జ్యుయలరీ షాపుకు వెళ్లాడు. ఈ క్రమంలో రీతూ గౌర్ తో పరిచయం ఏర్పడింది. అయితే, రీతూ గౌర్ కు వివాహం అయి ఓ పాప కూడా ఉంది. ఇక, వీరి పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె ఇంటికి బబ్లూ తరచుగా వెడుతుండేవాడు. కాగా, ఓ రోజు తన రెండో భార్యతో ఉన్న సమస్యలను రీతూకు చెప్పాడు. తన పోరు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. 

అల్లరి చేస్తుందని.. ఆరేళ్ల కూతురిని కర్రతో కొట్టి చంపిన తల్లి..

లవర్ ఆవేదనను అర్థం చేసుకున్న రీతు తనను ఓదార్చింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేసుకున్నారు. రీత్, రాణిని చంపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. మరో మహిళతో కలిసి జాకెట్ కుట్టించుకునే నెపంతో రాణి ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె గొంతు నులిమి హత్య చేసింది. ప్లాన్ లో భాగంగా బబ్లూ ఏమైందో తెలియనట్టు ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చి చెప్పారు. ఆ తరువాత పోస్టుమార్టం నివేదికను పరిశీలించిన పోలీసులు.. బబ్లూను గట్టిగా ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. దీంతో, ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

click me!