
Amirtpal Singh: ఖలీస్థానీ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ కోసం పోలీసులు 37 రోజుల పాటు గాలింపు చేశారు. అమృతపాల్ సింగ్ ఎట్టకేలకు పంజాబ్లోని మోగాలోని గురుద్వారాలో లొంగిపోయాడు. అసోంలోని దిబ్రూగఢ్లోని సెంట్రల్ జైలుకు ఆయన్ను తరలిస్తున్నారు.
కేసుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం:
>> పంజాబ్ పోలీసులు మార్చి 18న అమృతపాల్ సింగ్ , అతని సంస్థ 'వారిస్ పంజాబ్ దే' సభ్యులపై భారీ అణిచివేతను ప్రారంభించారు. ఫిబ్రవరిలో అజ్నాలా పోలీసు స్టేషన్పై దాడి చేసిన బోధకుల మద్దతుదారులకు ప్రతిస్పందనగా ఈ అణచివేత జరిగింది.
>> అమృతపాల్ సింగ్ రెండు పర్యాయాలు పోలీసులను మోసగించగలిగాడు. మార్చి 18న జలంధర్లో వాహనాలను మార్చడం ద్వారా, ఆపై మార్చి 28న హోషియార్పూర్లో తన కీలక సహచరుడు పాపల్ప్రీత్ సింగ్తో కలిసి పంజాబ్కు తిరిగి వచ్చినప్పుడు. ఈ పరిణామం తరువాత.. అమృత్పాల్ సింగ్కు మెంటార్గా పరిగణించబడుతున్న పాపల్ప్రీత్ను అరెస్టు చేశారు. అతనికి పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు.
>> మరోవైపు.. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు పాటియాలా, కురుక్షేత్ర , ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలలో అనేక CCTV ఫుటేజీలు , ఫోటోలు పరిశీలించారు. ప్రభుత్వం ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్గా అభివర్ణించే అమృతపాల్ సింగ్, పోలీసు జాగృతికి దూరంగా ఉంటూనే ఉన్నాడు.
>> ఇదిలా ఉండగా.. అమృతపాల్ రెండు వీడియోలు, ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. మార్చి 30న వెలువడిన తన రెండు వీడియోలలో ఒకదానిలో అమృతపాల్ సింగ్ తాను పారిపోయిన వ్యక్తిని కాదని, త్వరలో ప్రత్యక్షమవుతానని పేర్కొన్నాడు. వేర్పాటువాది దేశం విడిచి పారిపోయే వాడు కాదని పేర్కొన్నారు.
>> ఏప్రిల్ 14న జరుపుకునే బైసాఖీకి ముందు.. వేడుక సందర్భంగా అమృతపాల్ సింగ్ బటిండాలోని తఖ్త్ దమ్దామా సాహిబ్ గురుద్వారాలో లొంగిపోవచ్చని పుకార్లు వచ్చాయి. కానీ అలా జరగలేదు.
>> ఈ క్రమంలో తల్వాండి సబోలో బైసాఖీ పండుగ సందర్భంగా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, పంజాబ్ ప్రభుత్వం భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని అకల్ తఖ్త్ జతేదార్ గియానీ హర్ప్రీత్ సింగ్ ఆరోపించారు. భక్తుల సౌకర్యార్థం, భద్రత కోసం బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అకల్ తఖ్త్ (సిక్కుల అత్యున్నత తాత్కాలిక స్థానం) జతేదార్ పారిపోయిన బోధకుడిని పోలీసులకు సహకరించి లొంగిపోవాలని కోరారు. ఆయన ప్రయత్నం కూడా ఫలించలేదు.
>> మరోవైపు.. అమృతపాల్ కోసం అన్వేషణ వేగవంతం చేశారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో అతని రహస్య స్థావరాలను పోలీసులు శోధించారు. అమృతపాల్ సింగ్ ఆచూకీ గురించి విశ్వసనీయ సమాచారం అందజేసే వారికి తగిన బహుమతి ఇస్తామని పలు రైల్వే స్టేషన్లలో వాంటెడ్ పోస్టర్లు వేయించారు.
>> ఈ తరుణంలో ఏప్రిల్ 15న ఫతేఘర్ సాహిబ్లోని సిర్హింద్లో అమృతపాల్ సన్నిహితుడు జోగా సింగ్ను పోలీసులు అరెస్టు చేయగలిగారు. పోలీసుల వివరాల ప్రకారం.. జోగా సింగ్ అమృతపాల్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. జోగా సింగ్ ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో అమృతపాల్ కు ఆశ్రయం,వాహనాలను కూడా ఏర్పాటు చేశాడు.
>> అమృతపాల్ సహాయకులలో ఎనిమిది మంది - దల్జిత్ సింగ్ కల్సి, పాపల్ప్రీత్ సింగ్, కుల్వంత్ సింగ్ ధాలివాల్, వరిందర్ సింగ్ జోహల్, గుర్మీత్ సింగ్ బుక్కన్వాలా, హర్జిత్ సింగ్, భగవంత్ సింగ్ , గురిందర్పాల్ సింగ్ ఔజ్లా పై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అభియోగాలు మోపబడ్డాయి. వీరందరినీ దిబ్రూగఢ్ సెంట్రల్ జైలుకు తరలించారు.
>> ఫైనల్ గా 37 రోజుల పాటు పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్ ఈరోజు పంజాబ్లోని మోగాలోని గురుద్వారా వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత .. లొంగిపోయాడు.
>> శాంతిభద్రతలు కాపాడాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని పంజాబ్ పోలీసులు ప్రజలను కోరారు.