పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయలని రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ దంకర్ సీఎం మమత బెనర్జీకి లేఖ రాశారు.బెంగాల్ రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిందని ఆయన అభివర్ణించారు. పోలీస్ కస్టడీలో మరణించిన మదన్ గొరాయి మరణించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయలని రాష్ట్ర గవర్నర్ జగ్జీవ్ దంకర్ సీఎం మమత బెనర్జీకి లేఖ రాశారు.బెంగాల్ రాష్ట్రం పోలీస్ రాజ్యంగా మారిందని ఆయన అభివర్ణించారు. పోలీస్ కస్టడీలో మరణించిన మదన్ గొరాయి మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఘటన అమానవీయమైన ఘటన అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ హింస, కక్షసాధింపు చర్యలు, కస్టడీ వేధింపులు పెచ్చుమీరాయని గవర్నర్ ఆరోపించారు.
సీఎం మమత బెనర్జీకి గవర్నర్ రాసిన లేఖలో ఈ విషయాలను ప్రస్తావించారు.ఈ తరహా ఘటనలు చట్ట నిబంధనల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని సీఎంకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
also read:బెంగాల్ సీఎం మమతపై అనుచిత వ్యాఖ్యలు: బీజేపీ నేతకు కరోనా
రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. పోలీసుల రాజ్యంగా రాష్ట్రం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.ఈ తరహా ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.