మహిళపై వేధింపులు.. స్టేషన్‌ నుంచి విడిపించిన బీజేపీ నేత: రాహుల్ విమర్శలు

By Siva KodatiFirst Published Oct 18, 2020, 4:59 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే, అతడి కుమారుడు మహిళను వేధించిన వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయారంటూ మీడియాలో వస్తున్న‌ వరుస కథనాలపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక స్పందించారు.

బీజేపీ ఎమ్మెల్యే, అతడి కుమారుడు మహిళను వేధించిన వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌ నుంచి తీసుకెళ్లిపోయారంటూ మీడియాలో వస్తున్న‌ వరుస కథనాలపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక స్పందించారు.

ఆదివారం ట్విటర్‌ వేదికగా యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. యూపీ ప్రభుత్వం నేరస్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

 

बलिया की घटना में बीजेपी सरकार किसके साथ खड़ी है?

खबरों के अनुसार अफसरों के सामने हत्या करने के बाद आरोपी पुलिस की गिरफ्त में था मगर वह फरार हो गया। अभी तक पकड़ा नहीं गया। बीजेपी विधायक खुलकर आरोपी के साथ खड़ा है।

1/2

— Priyanka Gandhi Vadra (@priyankagandhi)

 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బేటీ బచావో మిషన్‌ మహిళలను కాపాడేందుకా? లేక నేరస్తులను కాపాడేందుకా? అని ప్రశ్నించారు. బేటీ బచావో నినాదాన్ని యూపీ ప్రభుత్వం అపరాధీ బచావోగా మార్చిందని ఎద్దేవా చేశారు.

కాగా ఇటీవల హత్రాస్‌లో అగ్రవర్ణానికి చెందిన నలుగురు యువకులు దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే

 

How it started: बेटी बचाओ

How it’s going: अपराधी बचाओ pic.twitter.com/N7IsfU7As5

— Rahul Gandhi (@RahulGandhi)
click me!