ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి..

By SumaBala BukkaFirst Published Oct 21, 2023, 11:33 AM IST
Highlights

ఛత్తీస్ గఢ్ లో పోలీసుల ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. 

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. పోలీసుల ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. కాంకేర్ జిల్లా కోయిల్ బేడా అటవీ ప్రాంతంలో ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇదిలా ఉండగా, త్తీస్ గఢ్ లో బీజేపీ నేతపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. బీపేజీ నేత బిర్జు తారామ్ ఇంట్లోకి చొరబడిన మావోయిస్టులు ఆయన మీద మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో బిర్జు తారామ్ మృతి చెందారు. 

click me!