13 ఏళ్ల బాలికను దారుణంగా టార్చర్ పెట్టిన గురుగ్రామ్ దంపతులు.. భౌతిక దాడులతో ఒళ్లు హూనం

By Mahesh KFirst Published Feb 8, 2023, 1:15 PM IST
Highlights

గురుగ్రామ్‌లో ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్న 13 ఏళ్ల బాలికపై ఆ దంపతులు దారుణంగా టార్చర్ పెట్టారు. ఇనుప వస్తువులు, కర్రలను వేడి చేసి చేతులు, ముఖం, ఇతర శరీర భాగాలపై గాయపరిచారు. భౌతికంగా హింసించారు. ఆమె ఫొటోలను ఓ యాక్టివిస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. పోలీసులు యాక్షన్ తీసుకున్నారు.
 

న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంటిలో పని మనిషిగా పెట్టుకున్న ఓ 13 ఏళ్ల బాలికను దంపతులు దారుణంగా టార్చర్ పెట్టారు. గత కొన్ని నెలలుగా ఆ మైనర్ బాలికపై భౌతిక దాడికి పాల్పడ్డారు. వేడి ఇనుప వస్తువులు, కర్రలతో కాల్చారు. ఒంటినిండా దెబ్బల గాయాలు, గాట్లే ఉన్నాయి. దాడులతో ఒళ్లు హూనం చేశారు. ఒంటి పై గాయం లేని చోటు లేదు. జార్ఖండ్‌కు చెందిన ఆ బాలిక ప్రస్తుతం ఓ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతున్నది. ఆమె పై లైంగిక దాడి జరిగిందా? లేదా? అనేది తెలుసుకోవడానికీ పరీక్షలు జరుగుతున్నాయి. పోలీసులు దంపతులపై కేసు పెట్టారు. వారిని అరెస్టు చేశారు.

ఆ బాలికకు భోజనం పెట్టకుండా ఆకలి మంటలకు వదిలిపెట్టారని, సరిగా పని చేయడం లేదని, ఆహారం దొంగిలిస్తున్నదని ఆమెను తరుచూ కొట్టేవారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొన్ని రోజులుగా ఆమెకు ఆహారం పెట్ట లేదని ఓ అధికారి తెలిపారు. డస్ట్ బిన్‌ లో పడేసిన ఆహారాన్ని ఆమె తినేదని పేర్కొన్నారు.

This 14 yr old girl has been brutally beaten up by an educated couple in Gurgaon. No body part that's not tortured. They cut her, beat her, burnt her with chimta. She had to eat food from dustbin. She was rescued after i raised an SOS & approached pic.twitter.com/qiWYTOwnxe

— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj)

గురుగ్రామ్‌కు చెందిన ఓ ఎన్జీవో ఫిర్యాదుతో పోలీసులు ఆ బాలికను రక్షించారు. ఆ బాలిక గురించి ఓ యాక్టివిస్ట్ చేసిన ట్వీట్ నిన్న వైరల్ అయింది. ఆ ట్విట్టర్ త్రెడ్ వైరల్ అయిన తర్వాత పోలీసులను ఎన్జీవో కాంటాక్ట్ అయింది. ఆ బాలిక ఫొటోలను యాక్టివిస్ట్ దీపికా నారాయణ్ భరద్వాజ్ షేర్ చేశారు. అందులో ఆ బాలిక ఒంటి నిండా గాయాలు, కాలిన గాయాలున్నాయి. ఆమె నుదుటిపై, పెదవులు, గదవ, చేతులపై గాయాలు ఉన్నాయి.

Also Read: శ్రద్ధా వాకర్ ఎముకలను దంచి పౌడర్ చేశాడు.. చివరిగా మూడు నెలల తర్వాత తలను పడేశాడు: ఢిల్లీ పోలీసులు

కొన్ని నెలల క్రితం ఓ ప్లేస్‌మెంట్ ఏజెన్సీ ద్వారా ఆమెను ఆ దంపతులు హైర్ చేసుకున్నారు. వారి మూడు నెలల పాపను చూసుకోవడానికి ఆమెను పనిలో పెట్టుకున్నట్టు తెలిసింది. 

ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. జువెనైల్ జస్టిస్ యాక్ట్, పోక్సో యాక్ట్ సహా మరికొన్ని ఆరోపణల కింద దంపతులపై కేసు నమోదైంది. 

ఆ బాలిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చాయి. అనంతరం, నిందితుల్లో ఒకరైన ఆ మహిళను, ఆమె పని చేసే సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

click me!