అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయండి: ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్

Published : Feb 08, 2023, 12:46 PM IST
అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయండి: ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్

సారాంశం

New Delhi: అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్, విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో రెండింటి కాంట్రాక్టులను అదానీలు దక్కించుకోగా, పష్చిమంచల్, పూర్వాంచల్ ప్రాంతాలకు మరో రెండు కంపెనీలు బిడ్లు దక్కించుకున్నాయి.  

Adani power deal: దేశంలో అదానీ గ్రూప్ వివాదం మాములుగా లేదు. సామాన్య ప్ర‌జానీకం నుంచి ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాల వ‌ర‌కు దేశంలో ప్ర‌స్తుతం అదానీ అంశ‌మే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక దేశంలో రాజ‌కీయ రచ్చ‌కు కార‌ణ‌మైంది. ఇక తాజాగా అదానీ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో రెండింటి కాంట్రాక్టులను అదానీలు దక్కించుకోగా, పష్చిమంచల్, పూర్వాంచల్ ప్రాంతాలకు మరో రెండు కంపెనీలు బిడ్లు దక్కించుకున్నాయి.

వివ‌రాల్లోకెళ్తే.. అదానీ గ్రూప్ తో సహా స్మార్ట్ మీటర్ల కొనుగోలు ప్రణాళికలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విరమించుకోవాలనీ, ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ.25,000 కోట్లను మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఉపయోగించాలని ఆల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దూబే మంగళవారం ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ట్టు 'ది టెలిగ్రాఫ్' నివేదించింది. సంబంధిత క‌థ‌నం ప్ర‌కారం.. "రాష్ట్రంలోని చాలా ఇళ్లు, ఫ్లాట్లలో ఇప్పటికే స్మార్ట్ మీటర్లు ఉన్నాయి. గత రెండు మూడేళ్లుగా వీటిని ఏర్పాటు చేశారు. అదానీ గ్రూప్ సహా మూడు కంపెనీల నుంచి స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు రూ.25,000 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరికీ బాగా తెలిసిన కారణాల వల్లనే అని స్పష్టమవుతోందని" శైలేంద్ర దూబే అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ కు వాస్తవానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరమనీ, ఇది చాలా సంవత్సరాలుగా విస్మరించబడిన ప్రాంతమ‌ని ఆయ‌న‌ అన్నారు. "మెరుగైన నెట్ వర్క్, హై క్వాలిటీ ఇన్సులేటర్లు కావాలి. ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించడానికి హై వోల్టేజ్ పరికరాలు కూడా అవసరం. కేవలం కొన్ని సంస్థలను లొంగదీసుకోవడానికి భారీ మొత్తాన్ని వృథా చేయడం కంటే ప్రజాధనాన్ని వీటి కోసం ఉపయోగించడం మంచి ఆలోచన" అని దూబే పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల కోసం మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను రద్దు చేయాలని ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఫెడరేషన్ యోచిస్తోంది. "అదానీ గ్రూపునకు ఇచ్చిన మధ్యాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ కు చెందిన రూ.5,400 కోట్ల టెండర్ ను ప్రభుత్వం రద్దు చేసింది. దక్షిణాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ కు స్మార్ట్ మీటర్లను సరఫరా చేసే బిడ్ ను ఇదే గ్రూప్ దక్కించుకుంది" అని దూబే తెలిపారు.

రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ పంపిణీ సంస్థల్లో అదానీలు రెండింటి కాంట్రాక్టులను దక్కించుకోగా, పష్చిమంచల్, పూర్వాంచల్ ప్రాంతాలకు మరో రెండు కంపెనీలు బిడ్లను దక్కించుకున్నాయి. అతి తక్కువ బిడ్డర్లుగా మారడానికి, కాంట్రాక్టులు గెలుచుకోవడానికి ఈ మూడు కంపెనీలు 'కార్టెల్'ను ఏర్పాటు చేసుకున్నాయని దూబే ఆరోపించారు. ఈ కంపెనీలేవీ మీటర్లు తయారు చేయకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. మధ్యవర్తులుగా సంపాదిస్తూ తయారీదారుల నుంచి మీటర్లు కొనుగోలు చేసి రాష్ట్రానికి సరఫరా చేస్తారని ఆరోపించారు. అనివార్య కారణాలను చూపుతూ ఫిబ్రవరి 4న తమ ప్రాంత టెండర్ ను రద్దు చేస్తున్నట్లు మధ్యాంచల్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అశోక్ కుమార్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Ram Mohan Naidu Speech | Tuticorin Airport Renamed as Thoothukudi Airport | Asianet News Telugu
Rammohan Naidu Launches Amazon Air First Cargo Flight from Delhi to Guwahati | Asianet News Telugu