
ఓ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల సీఎంలు, ఇతర రాజ్యాంగ అధిపతుల భద్రత అనేది అత్యంత ముఖ్యమైన అంశం. భద్రతలో ఏదైనా ఉల్లంఘన జరిగితే దేశ రాజకీయ, ఆర్థిక స్థిరత్వంపై విపత్కర ప్రభావాన్ని చూపుతుంది. దేశంలో పరిస్థితులు మారిపోతాయి. అందుకే దేశంలో ముఖ్యమైన వ్యక్తులకు భద్రత అందించడం అనేది కీలకమైన విషయం.
భారతదేశానికి రాజ్యాంగ పరంగా రాష్ట్రపతి తరువాత ముఖ్యమైన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన రక్షణ దేశానికి అంత్యంత ముఖ్యమైనది. అందుకే ఆయన భద్రంగా ఉంచడానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఏర్పడింది. ఇది ప్రభుత్వ సంస్థ. ఇది భారత ప్రధానికి 24 గంటల నిఘా, భద్రతను అందిస్తుంది.
SPG అనేది అత్యంత గోప్యంగా ఉండే ఎలైట్ ఏజెన్సీ. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏకైక లక్ష్యం ప్రధానమంత్రి భద్రత. ప్రస్తుతం 3,000 కంటే ఎక్కువ మంది యాక్టివ్ సిబ్బంది ఈ ఎస్పీజీలో పని చేస్తున్నారు. అక్టోబర్ 1984లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే హత్య చేసిన నేపథ్యంలో 1985లో దీనిని రూపొందించారు. ఎస్పీజీ చట్టం భారత ప్రధానికి ‘‘సమీప భద్రత ’’ను అందించాలని పిలుపునిచ్చింది.
బ్రిటీష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి మొదటి 34 సంవత్సరాల పాటు భారత ప్రధానమంత్రులకు ఢిల్లీ పోలీసులు రక్షణ కల్పించారు. దీనిని డిప్యూటీ కమిషనర్ హోదా కలిగిన అధికారి పర్యవేక్షించేవారు. అయితే 1984లో ఇందిరా గాంధీ హత్యానంతరం VVIPలు, VIPల అత్యున్నత స్థాయి భద్రతా నిర్మాణాన్ని మెరుగుపర్చాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావించిది. అంతకు ముందే 1981లో ఆవిర్భవించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ను శాశ్వత విభాగంగా మార్చింది. ఈ విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ 30 మార్చి 1985న పుట్టుకొచ్చింది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యాక్ట్- 1988 ప్రకారం.. భారత మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు, ప్రధానికి జాతీయంగా అంతర్జాతీయంగా అన్ని సమయాల్లో రక్షణ కల్పించడం ఈ గ్రూప్ బాధ్యత . కానీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (సవరణ) చట్టం- 2019 ద్వారా ఈ సంస్థ కేవలం ప్రధానమంత్రికి మాత్రమే రక్షణ కల్పిస్తుంది.
ఆసుపత్రి బెడ్పై కుక్క..మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాసుపత్రిలో ఘటన, వీడియో వైరల్...
ఎస్పీజీ జీరో ఎర్రర్, కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే నినాదంతో పనిచేస్తుంది. SPG సిబ్బంది ఎప్పుడూ భారత్ లో, విదేశీ భూభాగాలలో భక్తి, అంకితభావం, కృషి, ధైర్యంతో తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించాలి. శౌర్యం, సమర్పణం, సురక్షణం స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి తమను తాము పూర్తిగా అంకితం చేసుకుంటారు. SPG చట్టం ప్రకారం.. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు అవసరమైనప్పుడు ప్రత్యేక రక్షణ బృందానికి సహాయం చేయాల్సి ఉంటుంది.
SPG అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్లో పాల్గొంటుంది. ASLలో భాగంగా, SPG, PM రికార్డ్కు సామీప్య భద్రతను అందించడంలో పాల్గొనే అన్ని అగ్ర ఏజెన్సీలు, ప్రధానమంత్రి షెడ్యూల్లోని ప్రతి నిమిషం వివరాలను పర్యవేక్షిస్తాయి. ఒక రాష్ట్రానికి ప్రధాని పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు ఈ నిమిషానికి నిమిషానికి షెడ్యూల్ని నిర్వహిస్తారు. అయితే దీనిని SPG అధికారులు పర్యవేక్షిస్తారు. SPG భద్రతా ప్రోటోకాల్స్లో భాగంగా వేదికను శానిటైజ్ చేస్తుంది. అలాగే పీఎం ప్రయాణించే మార్గాన్ని సురక్షితం చేస్తుంది. ప్రధానమంత్రిని సంప్రదించే వారిపై విధ్వంస నిరోధక తనిఖీలు, పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తుంది.
గడ్డం సగం గీశాక డబ్బులివ్వమంటే గొడవ.. సెలూన్ లో ఇద్దరి హత్య..ఆస్తుల ధ్వంసం...
SPG ప్రధాన కార్యాలయం నైరుతి ఢిల్లీలోని ద్వారకలో ఉంది. ఈ ఏజెన్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సరిహద్దు భద్రతా దళం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్) నుంచి సిబ్బందిని తీసుకుంటుంది. SPG కమాండోలందరూ మూడు అంచెల స్క్రీనింగ్ ప్రక్రియను దాటుకొని వచ్చే అత్యుత్తమ వ్యక్తులు. వారు సాధారణంగా ప్రధానమంత్రి చుట్టూ కనిపిస్తారు. నల్లటి బిజినెస్ సూట్లు, సన్ గ్లాసెస్ ధరించి, టూ వే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఇయర్పీస్తో పాటు ఎవరికీ కనిపించిన ఆయుధాలను కలిగి ఉంటారు.