
భారత విమానయాన శాఖ: కొన్ని నెలలుగా భారతీయ విమానయాన సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం. దీంతో ఆ విమానాలు అత్యవసరంగా ల్యాండింగ్ కావడం సర్వసాధరమైంది. ఈ నేపథ్యంలో స్పైస్జెట్ విమానం క్యాబిన్లో పొగలు వ్యాపించిన సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చాలా సిరీయస్ అయ్యింది. దీనికి సంబంధించి స్పైస్జెట్ విమానంలో అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించింది. ఆపరేషన్లో ఉన్న అన్ని క్యూ400 విమాన ఇంజిన్లను వారంలోపు తనిఖీ చేయాలని సోమవారం ఆదేశించింది.
ఇది కాకుండా.. స్పైస్జెట్ చమురు లీక్ కేసుపై విచారణకు ఆదేశించింది. ఇంజిన్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పుడు స్పైస్జెట్ ఘటన మరియు దర్యాప్తుపై వివరణాత్మక ప్రకటన విడుదల చేసింది. స్పైస్జెట్ విమానం DHC-8-402 (Q400) విమానం VT-SQB ఫ్లైట్ నంబర్ SG 3735 క్యాబిన్లో పొగలు రావడంతో హైదరాబాద్లో అత్యవసర ల్యాండింగ్ చేసింది.
ఈ నెల 12న గోవా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న స్పెస్జెట్ విమానంలోని క్యాబిన్లో ఆకస్మత్తుగా పొగలు వ్యాపించాయి. దీంతో రాత్రి 11 గంటల సమయంలో ఆ విమానాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులోని ప్రయాణికులు అత్యవసర మార్గం ద్వారా బయటపడ్డారు. ఈ సమయంలో ఒక ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై DGCA విచారణకు ఆదేశించింది.
అయితే, ప్రాథమిక పరిశోధనల ఆధారంగా, ఇంజిన్ బ్లీడ్-ఆఫ్ వాల్వ్లో ఇంజిన్ ఆయిల్ లీక్ ఉన్నట్టు గుర్తించారు.విమానం ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్లోకి చమురు ప్రవేశించడం వల్ల క్యాబిన్లో పొగ వచ్చిందని విచారణలో తేలింది. 14 విమానాలు (28 PW150A ఇంజన్లు)తో కూడిన మొత్తం Q400 ఫ్లీట్పై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పైస్జెట్ని ఆదేశించింది.
విచారణ పూర్తయ్యే వరకు స్టాండర్డ్ ఏరో-సింగపూర్కు ఎలాంటి ఇంజన్ను పంపవద్దని స్పైస్జెట్ను ఆదేశించినట్లు వాచ్డాగ్ తెలిపింది. "డిజిసిఎ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని తగిన చర్యలు తీసుకుంటుంది" అని ప్రకటన పేర్కొంది. ఇంజిన్ ఆయిల్లో మెటల్, కార్బన్ రేణువుల ఉనికిని గుర్తించడానికి PW150A చమురు విశ్లేషణ కోసం ఇంజిన్ ఆయిల్ నమూనాలను తీసుకోమని కోరింది. విశ్లేషణ కోసం ప్రాట్ & విట్నీ కెనడాకు పంపబడింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు విమానంలోని ప్రయాణికులు పంచుకున్న వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఘటన జరిగిన రోజున స్పైస్జెట్ విమానంలోని ప్రయాణీకుల కొన్ని ఫోటోలు, వీడియోలు పొగ నిండిన క్యాబిన్లో కూర్చున్న ప్రయాణికులను చూపుతున్నాయి.
అంతేకాదు, క్యాబిన్లో పొగతో నిండిన తర్వాత కూడా విమానంలోని ఆక్సిజన్ మాస్క్లు వేయలేదని వీడియోను ట్విట్టర్లో పంచుకున్న ప్రయాణీకుడు పేర్కొన్నాడు. వీడియోలో, బ్యాక్గ్రౌండ్లో అలారం మోగుతుండగా ప్రయాణికులు తల దించుకుని కూర్చున్నట్లు చూడవచ్చు. మునుపటి నివేదికల ఆధారంగా, స్పైస్జెట్ విమానంలో 86 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంకా, ఈ సంఘటన కారణంగా ఆ రాత్రి దాదాపు 9 విమానాలు దారి మళ్లించబడ్డాయి.
ఏదైనా లోహ కణాలను గుర్తించిన సందర్భంలో విమానం నుండి బయలుదేరే ముందు ఇంజిన్ యొక్క బోరోస్కోపిక్ తనిఖీ చేయబడుతుంది. DGCA పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని తగిన చర్యలు తీసుకుంటుంది.