Amruta Fadnavis: 'ఏక్ 'థా' కపట‌ రాజా ..': ఉద్ధవ్ ఠాక్రేపై దేవేంద్ర ఫడ్నవీస్ భార్య హేళన.. ట్వీట్ తొలగింపు

Published : Jun 22, 2022, 02:29 AM ISTUpdated : Jun 22, 2022, 02:33 AM IST
 Amruta Fadnavis:  'ఏక్ 'థా' కపట‌ రాజా ..': ఉద్ధవ్ ఠాక్రేపై దేవేంద్ర ఫడ్నవీస్ భార్య హేళన.. ట్వీట్ తొలగింపు

సారాంశం

Amruta Fadnavis:  మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్ర‌మంలో  దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఉద్ధవ్ ఠాక్రేపై హేళన చేస్తూ.. ట్వీట్ చేసింది. కానీ విమ‌ర్శ‌లు రావ‌డంతో ఆ ట్విట్ ను తొలగించారు.   

Amruta Fadnavis:  మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య అమృత ఫడ్నవీస్( దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య‌) చేసిన‌ ట్వీట్ చర్చనీయాంశంగా మారాయి. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను హేళన చేస్తూ.. ఆమె ట్వీట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే అమృత వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. ఏక్ థా క‌ప‌ట‌ రాజు అని అమృత ట్వీట్ చేసిన‌ట్టు తెలుస్తోంది. విశేషమేమిటంటే.. ఈ ట్విట్ల‌పై శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే విమ‌ర్శ‌ల దాడి చేయ‌డంతో మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రమాద మేఘాలు కమ్ముకుంటున్నాయి.

అమృతా ఫడ్నవీస్.. ఎవ‌రి పేరు పెట్టకుండా ఒకరు 'మోసపూరిత' రాజు అని ట్వీట్ చేసింది. అమృత ఫడ్నవీస్ ట్వీట్ ద్వారా ఉద్ధవ్ ఠాక్రేను దూషించింది. అయితే.. కాసేపటికే ఆ ట్వీట్‌ను తొలగించారు.

ఆమె తర్వాత తొలగించిన ట్వీట్‌లో.. అమృత ఫడ్నవీస్ హిందీలో " ఏక్ 'థా' కపతి రాజా ... (ఒకప్పుడు చెడ్డ రాజు ఉన్నాడు)" అని రాశారు. ఆమె "రాజు" గురించి ప్రస్తావించడం, 'థా' చుట్టూ ఆమె ఉపయోగించిన కొటేషన్ గుర్తులు ముఖ్యంగా శివసేన ముఖ్యమంత్రి థాకరేకు సూచనగా చూడబడుతుంద‌ని భావిస్తున్నారు. 

ఒకరోజు క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని పడగొట్టే ప్ర‌యత్నం జ‌రుగుతోంది. శివసేన ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే తనతోపాటు కొందరు ఎమ్మెల్యేలతో కలిసి సూరత్ వెళ్లారు. ఆయనను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, ఆయ‌న మొండిగా వ్యవహరిస్తున్నారు. ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

శివసేన బిజెపితో పొత్తును పునరుద్ధరించి రాష్ట్రంలో పాలన కొనసాగించాలని షిండే ముఖ్యమంత్రితో ఫోన్‌లో డిమాండ్ చేశారు. తన తరలింపుపై పునరాలోచించి తిరిగి రావాలని థాకరే కోరినట్లు వర్గాలు తెలిపాయి.

ఇప్పటి వరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి పత్రంపై సంతకం చేయలేదని, పార్టీ అభివృద్ధి కోసమే ఈ చర్య తీసుకున్నానని షిండే పేర్కొన్నారు. ఇద్దరు శివసేన నేతలు ఆగ్రహంతో ఉన్న షిండేను హోటల్‌లో రెండు గంటల పాటు కలిశారు. ఆయన సారథ్యం వహిస్తున్న జి-22కి బిజెపి పాలిత రాష్ట్రంలో ఆతిథ్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది, ఇది తిరుగుబాటు యొక్క తెరవెనుక వ్యూహాలను స్పష్టంగా చూపిస్తుంది. మహారాష్ట్రలో షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.

మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. సైద్ధాంతికంగా వ్యతిరేకిస్తున్న పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి మహా వికాస్ అఘాదీ రూపశిల్పిగా కనిపిస్తున్న ఎన్సీపీ నేత శరద్ పవార్ మళ్లీ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో కీలక పాత్ర పోషించారు.

PREV
click me!

Recommended Stories

CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu
Thalapathy Vijay CM: విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం.. స్వీట్లు పంచి సంబరాల్లో ఫ్యాన్స్| Asianet Telugu