దళితుడి మృతదేహన్ని ఇలా తరలించారు

Published : Aug 22, 2019, 05:41 PM IST
దళితుడి మృతదేహన్ని ఇలా తరలించారు

సారాంశం

తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు.

వెల్లూరు: తమిళనాడులో దారుణం చోటు చేసుకొంది.ఓ దళితుడి మృతదేహన్ని 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జి పై నుండి తాళ్లకు కట్టి దించారు. అగ్రవర్ణాలకు చెందిన పొలాల మీదుగా శవాన్ని తీసుకెళ్లకుండా అంగీకరించకపోవడంతో ఇలా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. వన్నియంబాడికి సమీపంలోని నారాయణపురం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఓ దళిత వ్యక్తి మృతి చెందాడు. అతడి మృతదేహన్ని  స్మశానవాటికకు తరలించాలంటే ఇద్దరు అగ్రవర్ణాలకు చెందిన పొలాల నుండి  తరలించాల్సి ఉంది. అయితే  ఈ విషయమై  అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు అడ్డుచెప్పారు. దీంతో సమీపంలోని 20 అడుగుల ఎత్తు నుండి మృతదేహన్ని తరలించారు.
 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : ఒకేసారి రూ.18 వేల నుంచి రూ.54,000 శాలరీ జంప్ .. ఇది కదా హైక్ అంటే
LPG Booking: గ్యాస్ సిలిండ‌ర్ బుక్ చేయాలంటే 35 రోజులు ఆగాల్సిందేనా.? క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వం