ఢిల్లీ టీన్ మర్డర్ : హత్యకు కొద్ది రోజుల ముందు బాయ్‌ఫ్రెండ్‌ను బొమ్మ తుపాకీతో భయపెట్టి, బ్రేకప్ చెప్పి..

Published : May 30, 2023, 09:57 AM IST
ఢిల్లీ టీన్ మర్డర్ : హత్యకు కొద్ది రోజుల ముందు బాయ్‌ఫ్రెండ్‌ను బొమ్మ తుపాకీతో భయపెట్టి, బ్రేకప్ చెప్పి..

సారాంశం

ఢిల్లీలో ఆదివారం జరిగిన టీనేజ్ గర్ల్ హత్య కేసులో.. బాలిక బ్రేకప్ చెప్పడంతోనే ఈ దారుణం జరిగిందని తేలింది. కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుడిని బొమ్మ తుపాకీతో బెదిరించినట్లు సమాచారం.

న్యూఢిల్లీ : సోమవారం ఢిల్లీలో కలకలం సృష్టించిన 16 ఏళ్ల బాలిక హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. వారిద్దరు గత మూడేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. తమ ప్రేమ వ్యవహారానికి బ్రేకప్ చెప్పాలని అమ్మాయి అనుకుంది. కాగా.. ఈ క్రమంలోనే ప్రియుడిని ఆమె బొమ్మ తుపాకీతో భయపెట్టినట్టు వెలుగులోకి వచ్చింది. 

ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు తన ప్రియురాలిని పలుమార్లు కత్తితో పొడిచి, బండరాయితో ఆమె తలను చితకబాదిన ఘటన ఆదివారం ఢిల్లీలో చోటుచేసుకుంది. నేరం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. యువతి కొన్ని రోజుల క్రితం ఆ వ్యక్తిని భయపెట్టడానికి బొమ్మ పిస్టల్‌ను గురిపెట్టిందని పోలీసుల విచారణలో తేలింది. 

దారుణం.. ప్రియురాలిని కత్తులతో పొడిచి, బండరాయితో మోది హత్య.. సీసీటీవీలో హత్యోదంతం..

బాలిక తమ మూడేళ్ల బంధానికి ముగింపు పలకాలని కోరుకోవడంతో ఇద్దరికీ  గత కొంతకాలంగా గొడవ పడుతున్నారని తేలింది. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయిస్తానని కూడా బాలిక బెదిరించిందని వారు తెలిపారు. అమ్మాయి చేతి మీద మరొక వ్యక్తి పేరు పచ్చబొట్టు కూడా ఉందని సమాచారం. 

నిందితుడు ఫ్రిజ్, ఏసీ మెకానిక్‌గా పనిచేసిన సాహిల్ గా గుర్తించారు. వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని రద్దీగా ఉండే లేన్‌లో రాయితో తల పగులగొట్టే ముందు బాలికను 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు.

సమీపంలోని సీసీ కెమెరా ద్వారా బంధించబడిన సంఘటనకు చెందిన చిల్లింగ్ ఫుటేజీ, నిందితుడు బాధితురాలిని ఒక చేత్తో గోడకు ఒత్తిపట్టి  పదేపదే కత్తితో పొడిచినట్లు చూపించింది. బాలిక నేలపై పడిపోయినా అతతగ ఆగలేదు. ఆమెను తన్నడం, ఆమె మీద పదేపదే సిమెంట్ స్లాబ్‌ తో దాడి చేయడం కనిపించింది.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని అతని అత్త ఇంటి నుంచి 20 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాలికతో స్నేహం చేసేందుకు సాహిల్ తన పేరు మార్చుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై విరుచుకుపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత తనదేనని, ‘ఏదైనా చేయమని’ ఆయనను కోరారు. ఢిల్లీ మహిళా ప్యానెల్ కూడా ఈ సంఘటన మీద స్పందించింది. స్వాతి మలివాల్ పోలీసులను నిందించింది.దేశ రాజధానిలో పోలీసులకు, చట్టానికి "ఎవరూ భయపడడం లేదు’ అంటూ విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu