ఢిల్లీలో మరో కేసు: దేశంలో 31 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు

By narsimha lodeFirst Published Mar 6, 2020, 12:12 PM IST
Highlights

దేశంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా   అధికారులు ప్రకటించారు. థాయ్‌లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు శుక్రవారం నాడు గుర్తించారు. దీంతో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 31  మందికి చేరింది.  

న్యూఢిల్లీ:దేశంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్టుగా   అధికారులు ప్రకటించారు. థాయ్‌లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా అధికారులు శుక్రవారం నాడు గుర్తించారు. దీంతో ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య 31  మందికి చేరింది.  

Also read:మీడియా ఓవరాక్షన్.. కంగారుపడ్డ కరోనా అనుమానితుడు: హాస్పిటల్ నుంచి పరార్

ఢిల్లీలో నివాసం ఉండే వ్యక్తి ఇటీవలనే థాయ్‌లాండ్‌‌కు వెళ్లి వచ్చారు. థాయ్‌లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టుగా గుర్తించారు.  ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌లో అతను నివాసం ఉంటాడు. దేశంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్రం చర్యలు తీసుకొంటుంది.

అన్ని విమానాశ్రయాలు, ఓడ రేవులు ఇతర ప్రాంతాల్లో కూడ  స్క్రీనింగ్‌  టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని విమానాశ్రయాలు, ఓడ రేవులు ఇతర ప్రాంతాల్లో కూడ  స్క్రీనింగ్‌  టెస్టులు నిర్వహిస్తున్నారు.  చైనా, దక్షిణకొరియా, జపాన్  దేశాలకు కేంద్రం వీసాలను రద్దు చేసింది. 

click me!