
Delhi CM slams BJP over bulldozers: కొన్ని రోజులుగా దేశ రాజధానిలోని అనేక ప్రాంతాల్లో ఆక్రమణల వ్యతిరేక బుల్డోజర్లతో నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ కొనసాగుతోంది. అయితే, దీనిపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తున్నది. అనుమతులు మంజూరు చేసిన అధికారులపై ముందుగా చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నాడు దేశ రాజధానిలో పౌర సంఘం చేపట్టిన ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్పై స్పందిస్తూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఢిల్లీలో ప్రజల ఇళ్లు, దుకాణాలను బీజేపీ ధ్వంసం చేస్తున్న తీరు సరికాదు. 63 లక్షల మంది ప్రజల దుకాణాలు లేదా ఇళ్లపై బుల్డోజర్లు నడపగలవు. ఇది స్వతంత్ర భారతదేశానికి అతిపెద్ద విధ్వంసం అవుతుంది" అని ఆయన ఒక వీడియో ప్రసంగంలో అన్నారు. పౌర సంస్థల ఎన్నికలలో AAP అధికారంలోకి వస్తే నివాసితుల ఆస్తుల యాజమాన్యాన్ని బదిలీ చేస్తామని హామీ ఇచ్చారు.
దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మరియు నగరంలో పౌర సంస్థను పాలిస్తున్న బీజేపీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా బుల్డోజర్ల వివాదం ఈ రెండు పార్టీల మద్య రాజకీయ వైరాన్ని మరింతగా పెంచింది. గత వారం చట్టవిరుద్ధమైన నిర్మాణాలను కూల్చివేయడానికి పౌర సంఘం బుల్డోజర్లతో నర్మాణాలు కూల్చివేయాడికి వెళ్లినప్పుడు.. ఒకప్పుడు పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల వేదికైన షాహీన్ బాగ్లో పెద్దఎత్తున నిరసనల చెలరేగాయి. ఆ తర్వాతి రోజుల్లో న్యూ ఫ్రెండ్స్ కాలనీ, ద్వారక తదితర ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించాయి. ‘‘ఢిల్లీలో బీజేపీ పాలిత ప్రజాసంఘాలు, కొన్ని ప్రాంతాల్లో బుల్డోజర్లను తిప్పడం గత కొన్ని వారాలుగా చూస్తున్నాం, ఇది వచ్చేనెలల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు. నగరంలోని భాగాలను ఆక్రమించిన నిర్మాణాలను తొలగిస్తున్నాం. ఆక్రమణలు జరగడం మాకు కూడా ఇష్టం లేదు... కానీ ఏళ్ల తరబడి నగరంలో జరిగిన అభివృద్ధి తీరు.. నగరంలో 80 శాతానికి పైగా ఆక్రమణలకు గురైందని చెప్పవచ్చు" అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.
ఆక్రమణలు జరగడం మాకు కూడా ఇష్టం లేదు.. ఇన్నేళ్లుగా నగరం అభివృద్ధి చెందిన తీరు చూస్తే 80 శాతానికి పైగా ఢిల్లీని అక్రమంగా, ఆక్రమణలకు గురైంది. అంటే ఢిల్లీలో 80 శాతం నాశనం చేస్తారా? అంటూ బీజేపీ ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రశ్నించారు. "ఇది జరుగుతున్న తీరు సరికాదు.. వారి వద్ద కాగితాలు లేవు. ఆ వ్యక్తి ఆ కాగితాలను రుజువుగా చూపించడానికి ప్రయత్నిస్తుండగా వారు ఎవరి ఇల్లు లేదా దుకాణంలోకి ప్రవేశించి ధ్వంసం చేయడం ప్రారంభిస్తున్నారు. ఇది జరుగుతున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము" అని తెలిపారు. ‘‘గత 15 ఏళ్లలో ఎంసీడీలో బీజేపీ అధికారంలో ఉండి డబ్బులు తీసుకుంది.. వారి పదవీకాలం మే 18తో ముగుస్తుంది.. ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే రాజ్యాంగపరంగా మీకు అధికారం ఉందా?.. ఎన్నికలు జరగనివ్వండి.. ఆ పార్టీ నిర్ణయం తీసుకోనివ్వండి.. అందరికీ తెలుసు. ఆప్ అధికారంలోకి వస్తుందని.. మురికివాడలు ఉన్న చోట ఇళ్లను ఏర్పాటు చేస్తామని ఎన్నికల వాగ్దానాలను ప్రత్యర్థి పార్టీకి గుర్తు చేస్తూ" కేజ్రీవాల్ అన్నారు.