విమానంలో సాంకేతిక లోపం: ఫ్లైట్‌లో కేంద్ర మంత్రి గడ్కరీ

By narsimha lodeFirst Published Aug 13, 2019, 10:46 AM IST
Highlights

విమానంలో సాంకేతిక లోపాన్ని చివరి నిమిషంలో పైలెట్ గుర్తించారు. టేకాఫ్ సమయంలో పైలెట్ గుర్తించాడు. దీంతో విమానం నుండి ప్రయాణీకులను దింపేశారు.

ముంబై: నాగ్‌పూర్-ఢిల్లీకి వెళ్లే ఇండిగో విమానంలో  మంగళవారం నాడు సాంకేతిక లోపం చోటు చేసుకొంది. విమానం టేకాఫ్ సమయంలో పైలెట్ ఈ విషయాన్ని గుర్తించాడు. ఈ విమానంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడ ఉన్నాడు. వెంటనే  విమానం నుండి ప్రయాణీకులను దించేశారు.

నాగ్‌పూర్- ఢిల్లీకి వెళ్లే  ఇండిగో విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకొంది. టేకాఫ్ సమయంలో ఈ విషయాన్ని పైలెట్ గుర్తించాడు. వెంటనే  ఆయన విమానం నుండి  ప్రయాణీకులను కిందకు దించేశారు.  విమానం టేకాఫ్ అయితే  ప్రమాదం చోటు చేసుకొనేదనే చెబుతున్నారు.  ఈ విమానంలోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడ ఉన్నారు.
 

click me!