శ్రీలంకలో కవరేజీ కోసం వెళ్లిన ఢిల్లీ జర్నలిస్టు అరెస్ట్

By narsimha lodeFirst Published May 3, 2019, 3:44 PM IST
Highlights

శ్రీలంకలో జరిగిన పేలుళ్ల కవరేజీ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖీ అహ్మద్ డానిష్‌ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లో కవరేజీకి వెళ్లాడనే నెపంతో సిద్దిఖీని అరెస్ట్ చేశారని శ్రీలంక ప్రకటించింది.

కొలంబో:  శ్రీలంకలో జరిగిన పేలుళ్ల కవరేజీ కోసం వెళ్లిన ఢిల్లీకి చెందిన ఫోటో జర్నలిస్టు సిద్దిఖీ అహ్మద్ డానిష్‌ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఓ స్కూల్లో కవరేజీకి వెళ్లాడనే నెపంతో సిద్దిఖీని అరెస్ట్ చేశారని శ్రీలంక ప్రకటించింది.

రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఉద్యోగిగా సిద్దిఖీ పనిచేస్తున్నాడు. శ్రీలంకలోని నిగొంబో సిటీలోని ఓ స్కూల్లో అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ సిద్దిఖీని లంక పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈస్టర్ రోజు సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ఓ విద్యార్థి చనిపోయాడు. ఈ విద్యార్ధి గురించి వివరాలు తెలుసుకొనేందుకు సిద్దిఖీ లోపలికి వెళ్లబోయారని లంక పోలీసులు ఆరోపించారు. 

అనుమతి లేకుండా స్కూల్లోకి చొరబాటుకు ప్రయత్నించారనే అభియోగాలపై సిద్దిఖీ అరెస్ట్ అయ్యారని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ నెల 15వ తేదీ వరకు నెగొంబో మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించారని అని  ఓ పోలీస్ అధికారి తెలిపారు. 
 

click me!