ఉత్తరాఖండ్: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

Siva Kodati |  
Published : Mar 13, 2021, 03:12 PM IST
ఉత్తరాఖండ్: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

సారాంశం

ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

ఢిల్లీ- డెహ్రాడూన్ శతాబ్ధీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం జరిగింది. సీ 4 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వెంటనే అలర్ట్ అయిన లోకో పైలట్.. రైలుని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది.

ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను కిందకి దింపేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ఉత్తరాఖండ్‌లోని కన్‌స్రో వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?