కాంస్యం గెలిచిన హాకీ టీమ్.. మోదీ స్పందన ఇదే..!

By telugu news teamFirst Published Aug 5, 2021, 10:27 AM IST
Highlights

ఈ విజయంపై తాజాగా.. ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హాకీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు.

41 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ... భారత హాకీ జట్టు టోక్యో  ఒలంపిక్స్ లో 5-4 తో జర్మనీని ఓడించి.. కాంస్య పతకం సాధించింది. 1980 తర్వాత భారత హాకీ జట్టు జర్మనీ పై అద్భుతమైన విజయం సాధించి.. భారత్ కు కాంస్యాన్ని అందించింది.

ఈ విజయం అందరికీ మాంచి కిక్ ఇచ్చింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా... ఈ విజయంపై తాజాగా.. ప్రధాని నరేంద్రమోదీ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదికగా హాకీ జట్టుపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నారు.

‘ చరిత్రలో నిలిచిపోయేరోజు. ఈ రోజుని ప్రతి భారతీయుడు గుర్తించుకునే రోజు ఇది. కాంస్యం గెలిచిన భారత పురుషుల జట్టుకి అభినందనలు. ఈ ఘనతతో మన దేశ ఖ్యాతిని పెంచారు. హాకీ జట్టుని చూసి.. యావత్ భారత దేశం గర్వపడుతుతోంది.’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

Historic! A day that will be etched in the memory of every Indian.

Congratulations to our Men’s Hockey Team for bringing home the Bronze. With this feat, they have captured the imagination of the entire nation, especially our youth. India is proud of our Hockey team. 🏑

— Narendra Modi (@narendramodi)

 

మోదీ మాత్రమే కాదు.. చాలా మంది సెలబ్రెటీలు ఈ విజయంపై సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. జట్టుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

click me!