సహజీవనం, ఇద్దరు పిల్లలు.. మరో వ్యక్తిమీద మోజు.. అడ్డుగా ఉన్న సహచరుడిని దారుణంగా..

By AN TeluguFirst Published Aug 5, 2021, 10:06 AM IST
Highlights

ముఖేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. సొంత ఊరు ను సైతం వదిలి ఇద్దరు నోయిడాలో కాపురం పెట్టారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోక పోయినా భార్యాభర్తల్లానే కలిసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వివాహేతర సంబంధాలు, సహజీవనం ఈరోజుల్లో చాలా చోట్ల అతి మామూలుగా మారిపోయాయి. ఈ రెండింటి వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడితే.. సజీవ జీవనం వంటి సంబంధాలు వారి జీవితాలను నట్టేట ముంచుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ఏ మాత్రం మార్పు లేదు.

 ఓ యువకుడి మోజులో పడి తను ప్రేమించిన వ్యక్తిని ఆ యువతి చేతులారా చంపుకున్న ఘటన కలకలం రేపింది.  ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. ముఖేష్ అనే 22 ఏళ్ల యువకుడు ఓ యువతిని ప్రేమించి కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. సొంత ఊరు ను సైతం వదిలి ఇద్దరు నోయిడాలో కాపురం పెట్టారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోక పోయినా భార్యాభర్తల్లానే కలిసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట జీవితంలోకి అంకుష్ అనే యువకుడు రాకతో వీరి జీవితాలు తలకిందులయ్యాయి. తన ఇంటి పక్కన ఉండే అంకుష్ తో ముఖేష్ భార్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం వాళ్ళిద్దరు సంబంధాన్ని కొనసాగించారు. ఇటీవల ముఖేష్ కు ఈ విషయం తెలియడంతో తాను పెళ్లి చేసుకో పోయినప్పటికీ భార్యలా చూసుకుంటే.. తనను కాదని అంకుష్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేకపోయాడు.

పరాయి వ్యక్తితో పడకగదిలో చనువుగా భార్య.. భర్త చూడటంతో..

 ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి కూడా మరిచి ఇదే పనంటూ యువతిని మందలించాడు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ యువతి ఈ విషయాన్ని తన ప్రియుడు అంకుష్ కి చెప్పింది. అంతేకాక ముఖేష్ అడ్డు తొలగించుకోవాలని చెప్పడంతో.. ముఖేష్ హత్యకు ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ వేశారు. దీనిలో భాగంగా ముఖేష్ పై లేని ప్రేమను నటించి అతనికి ఆమె మద్యం తాగించింది. మత్తులో తూలిపోయిన ముఖేష్ నిద్రలోకి జారుకోగానే  ప్రియుడు అంకుష్ కి ఫోన్ చేసింది. అంకుష్ ఆమె ఇంటికి రాగానే ఇద్దరూ కలిసి మద్యం మత్తులో ఉన్న ముఖేష్ ను హతమార్చారు. 

ఇక మరుసటి రోజు తెల్లవారు జామున నుంచి పెద్దగా కేకలు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని ఆరాతీశారు. దీంతో రాత్రి మద్యం తాగి నిద్రపోయి ఉదయాన్నే ఇలా చనిపోయి కనిపించాడని నాటకం ఆడింది. పోలీసులతో కూడా ఇదే కట్టు కథలు చెప్పి నమ్మించ సాగింది. అయితే ఆ యువతి ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. 

click me!