దళిత ఓటర్లపై కన్నేసిన బీజేపీ.. అంబేద్కర్ జయంతి నుంచి దేశవ్యాప్తంగా 'ఘర్ ఘర్ జోడో' ప్రచారం

Published : Mar 06, 2023, 04:37 PM IST
దళిత ఓటర్లపై కన్నేసిన బీజేపీ..  అంబేద్కర్ జయంతి  నుంచి దేశవ్యాప్తంగా 'ఘర్ ఘర్ జోడో' ప్రచారం

సారాంశం

New Delhi: దేశంలో దళిత ఓట్ల శాతాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ దేశవ్యాప్త 'ఘర్ ఘర్ జోడో' ప్రచారాన్ని ప్రారంభించి సామాజిక మద్దతును పొందడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది.  అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్ 14)న ఈ క్యాంపెయిన్ ప్రారంభమవుతుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.  

BJP-Ghar Ghar Jodo Campaign: దళితులు, షెడ్యూల్డ్ కులాల మద్దతు కూడగట్టేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా భారీ ప్రచారాన్ని ప్రారంభించనుంది. 'ఘర్ ఘర్ జోడో' పేరుతో ఏప్రిల్ 14 (అంబేడ్కర్ జయంతి) నుంచి మే 5 (బుధ్ జయంతి) వరకు ఈ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ స‌మ‌యంలో (ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు) బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా దళిత బస్తీల్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా 17 శాతంగా ఉన్న ఈ ఓటర్లను (దళిత సామాజికవర్గం) త‌మ‌వైపున‌కు ఆక‌ర్షించే లక్ష్యం ముందుకు సాగ‌నున్న‌ట్టు స‌మాచారం. 

గతంలో ప్రభుత్వ పథకం ప్రయోజనాలు అందని దళిత కుటుంబాలకు ఆ ప్రయోజనాలను అందించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యంమ‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ప్రచారం ముగింపు సందర్భంగా ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ దళిత సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024లో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు గాను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350కి పైగా సీట్లు గెలుచుకుంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ నేత రాందాస్ అథవాలే జోస్యం చెప్పారు.

మాయావతి హయాంలో బీఎస్పీ పతనాన్ని ప్రస్తావిస్తూ దళితులు, ముస్లింలు ఎన్డీయేకు ఓటు వేయాలని ప్రముఖ దళిత నేత అథవాలే కోరారు. జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన, ముస్లింలతో సహా సమాజంలోని అన్ని వర్గాల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేద్క‌ర్ భారతదేశంలో అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని ఊహించారనీ, అది ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో సాకారమవుతోందని ఆయ‌న పేర్కొన్న‌ట్టు హిందుస్తాన్ టైమ్స్ ఒక నివేదికలో పేర్కొంది. 

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' అప్రధానంగా అభివర్ణించారు. 70 ఏళ్లుగా కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దళిత, ముస్లిం, వెనుకబడిన, ఓబీసీ, గిరిజనులు లేదా వ్యాపారులు అనే తేడా లేకుండా సమాజంలోని అన్ని వర్గాల కోసం చాలా అభివృద్ధి పనులు చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ముస్లింలు, దళితులు ఆర్ పిఐ, బీజేపీల‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మాయావతి పతనం నిలకడగా ఉన్నందున ఆమెతో అంటకాగడం వల్ల తమకు ఒరిగేదేమీ లేదన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tamil Nadu CM Vijay: సామాన్యుడిలా బస్సులో ప్రయాణిస్తూ వీడియో తీసుకున్న సీఎం విజయ్| Asianet Telugu
Arunachal Pradesh Flood: అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వరదలు కొట్టుకుపోయిన ఇళ్లు, వాహనాలు| Asianet Telugu