ఐఈడి బ్లాస్టులతో రెచ్చిపోయిన మావోలు... సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మృతి

Arun Kumar P   | Asianet News
Published : Nov 29, 2020, 08:55 AM ISTUpdated : Nov 29, 2020, 08:57 AM IST
ఐఈడి బ్లాస్టులతో రెచ్చిపోయిన మావోలు... సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మృతి

సారాంశం

భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడ్డారు మావోయిస్టులు. 

చత్తీస్‌గడ్: సుక్మా జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి తమ ఉనికిని చాటుకున్నారు. భుర్కపాల్ అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సిఆర్ఫిఎఫ్ బృందాలపై ఐఈడీ బ్లాస్ట్ లతో విరుచుకుపడ్డారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో ఎనిమిది మంది సిఆర్పిఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఓ  సీఆర్పీఎఫ్ అధికారి మృతి చెందారు.

మావోయిస్ట్ దాడిపై బస్తర్ ఐజీ సురేందర్ మాట్లాడుతూ...  గాయపడిన జవాన్లందరిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో రాయ్ పూర్ కు తరలించామన్నారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఓ అసిస్టెంట్ కమాండర్ మృతిచెందినట్లు తెలిపారు. మిగతా ఏడుగురు చికిత్స పొందుతున్నారని... వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు ఐజీ. 

ఇటీవలే ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా అడవుల్లో మావోయిస్టులు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. బలగాల కాల్పుల్లో ఓ మావోయిస్ట్ మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాలతో పోలీసులకు చిక్కాడు. మావోల నుండి ఏకే 47 గన్ తో పాటు మరికొన్ని మారణాయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను గ్రేహౌండ్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 
 


 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !