ప్రధానమంత్రి ఆఫీసు పేరుతో ఈ మెయిల్స్.. డాక్టర్ అరెస్ట్..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 28, 2020, 05:11 PM IST
ప్రధానమంత్రి ఆఫీసు పేరుతో ఈ మెయిల్స్.. డాక్టర్ అరెస్ట్..

సారాంశం

తాను కొన్న ఆఫీసులు అప్పగించడం లేదన్న అసహనంతో ఓ డాక్టర్ తప్పుడు పనికి దిగజారాడు. ప్రధానమంత్రి కార్యాలయం పేరుతో పేక్ ఈ మెయిల్స్ పంపాడు. చివరికి సైబర్ క్రైం నేరంలో జైలు పాలయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. 

తాను కొన్న ఆఫీసులు అప్పగించడం లేదన్న అసహనంతో ఓ డాక్టర్ తప్పుడు పనికి దిగజారాడు. ప్రధానమంత్రి కార్యాలయం పేరుతో పేక్ ఈ మెయిల్స్ పంపాడు. చివరికి సైబర్ క్రైం నేరంలో జైలు పాలయ్యాడు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. 

అహ్మదాబాద్ నివాసి అయిన విజయ్ పరీఖ్ అనే డాక్టర్, స్థానిక పరిమళ్ గార్డెన్ ప్రాంతంలో నితీశ్ షా అనే వ్యక్తి నుండి రెండు ఆఫీసులను కొన్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత నితీష్ ఆ కార్యలయాలను డాక్టర్ కి అప్పగించడానికి నిరాకరించాడు. ఎలాగైనా ఆ ఆఫీసులను దక్కించుకోవాలని, తన సమస్య పరిష్కరించుకోవాలనుకున్నాడు. దీనికోసం ఓ ప్లాన్ వేశాడు. 

ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మెయిల్స్ వస్తే అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి తనకు తక్షణ న్యాయం చేస్తారని భావించాడు. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయం అధికారుల పేరుతో గుజరాత్ ఉన్నతాధికారులతోపాటు ఐపీఎస్ అధికారులకు తన సమస్యను వివరిస్తూ మెయిల్స్ చేశాడు. 

విజయ్ అనే డాక్టర్ రెండు కార్యాలయాలను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు ఆ వ్యక్తి వాటిని తన పేరిట మార్చడం లేదని తనకు న్యాయం జరిపించమని పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించినట్లు ఆ మెయిల్ లో ఉంది. రాష్ట్ర అధికారులు దీనిపై స్పందించాలని ఈ ఘటనకు సంబంధించి పీఎంఓ అధికారులు పర్యవేక్షిస్తున్నారని మెయిల్స్ లో ఉంది. 

దీనిమీద అనుమానం వచ్చిన నితీష్ సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాడు. ఆ ఈ మెయిల్ ఐడీలను పరిశీలించిన సైబర్ క్రైం పోలీసులు వాటిని పరీఖ్ అనే డాక్టర్ పంపినట్లు గుర్తించారు. తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం పీఎంఓ అధికారుల పేరును వాడుకున్న వైద్యుడిని అరెస్ట్ చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu