ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - అలహాబాద్ హైకోర్టు

Published : Mar 04, 2023, 09:01 AM IST
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి - అలహాబాద్ హైకోర్టు

సారాంశం

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. గో రక్షణ కోసం, గో హత్యలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. 

గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు పిలుపునిచ్చింది. గోహత్యను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఉత్తరప్రదేశ్ గోహత్య నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడి పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ షమీమ్ అహ్మద్ సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.

ఏషియానెట్ న్యూస్ కార్యాలయ దాడిపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం.. విచార‌ణకు ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా డిమాండ్

గొడ్డు మాంసం తీసుకెళ్తున్నందుకు మహ్మద్ అబ్దుల్ ఖలీక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణను ముగించాలని కోరుతూ నిందితుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా హిందువులకు గోవుపై విశ్వాసం ఉన్నాయని, వారు దానిని అత్యంత పవిత్రమైన జంతువుగా, దేవుని ప్రతినిధిగా భావిస్తారని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది. మనం లౌకిక దేశంలో జీవిస్తున్నామని, కాబట్టి అన్ని మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలని బెంచ్ తెలిపింది. హిందూమతంలో ఆవును దైవిక, సహజమైన దయకు ప్రతినిధిగా భావిస్తారని పేర్కొంది. అందువల్ల ఆవుకు రక్షణ కల్పించాలని, అందరూ గౌరవించాలని సూచించింది. 

కాగా.. గోహత్యను నిలిపివేస్తే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని గత నెలలో గుజరాత్ కోర్టు పేర్కొంది. మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను తరలించిన కేసులో ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గోవధను నిలిపివేస్తే భూమ్మీద ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తాపి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి నవంబర్ లో ఉత్తర్వులు జారీ చేసినట్లు లీగల్ న్యూస్ వెబ్ సైట్ లైవ్ లా తెలిపింది.

ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి సిబ్బందిని బెదిరించిన ఎస్ఎఫ్ఐ.. ప్రెస్ క్ల‌బ్ ఆఫ్ ఇండియా ఆందోళన

ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సమీర్ వినోద్‌చంద్ర వ్యాస్ కూడా మాట్లాడుతూ ఆవు పేడతో తయారు చేసిన ఇళ్లు అణు వికిరణానికి గురికావని, అనేక నయం కాని వ్యాధులకు గోమూత్రం ఔషదం అని సైన్స్ రుజువు చేసిందన్నారు. ఆవులు అంతరించిపోతే విశ్వం ఉనికి లేకుండా పోతుందని న్యాయమూర్తి అన్నారు. గోవధ కేసులు పెరగడం వాతావరణ మార్పులకు దారితీసిందని న్యాయమూర్తి అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu